ETV Bharat / state

సీఎం జగన్ ఇంటి ముట్టడికి వచ్చిన విద్యార్థులపై అత్యాచారయత్నం కేసు

సీఎం జగన్ ఇంటి ముట్టడికి యత్నించిన టీఎన్​ఎస్​ఎఫ్ నేతలపై అత్యాచారయత్నం కింద తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ రిపోర్టు కోర్టుకు సమర్పించగా..రిపోర్టు చూసిన న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. సీఎం ఇంటి ముట్టడికి వచ్చిన వారిపై అత్యాచారం కేసా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jan 23, 2021, 9:18 PM IST

Updated : Jan 23, 2021, 10:38 PM IST

రిమాండ్ రిపోర్టు
రిమాండ్ రిపోర్టు

ఏపీ ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లిన విద్యార్థులపై పోలీసులు అత్యాచారయత్నం కేసుగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ముట్టడికి యత్నించిన ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో రిమాండ్‌ రిపోర్టులో అత్యాచార యత్నంగా పేర్కొనడంపై మంగళగిరి కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థుల సమస్యలపై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో సీఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఐదుగురు విద్యార్థి నేతలు సీఎం నివాసానికి అర కిలోమీటర్‌ దూరం వరకు వెళ్లగలిగారు. వారిని తెలుగు తల్లి విగ్రహం సమీపంలోనే పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఐదుగురిపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. వారిని శనివారం మంగళగిరి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టు చూసిన న్యాయమూర్తి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ రిపోర్టులో అత్యాచారయత్నం అనే పదం వాడటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది అత్యాచారయత్నం కేసు ఎలా అవుతుందంటూ నిలదీసినట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు.. పాత ఎఫ్‌ఐఆర్‌ కాపీలను కంప్యూటర్‌లో మార్చే క్రమంలో ఆ పదాలను మార్చకుండా అలాగే వదిలేయడంతో ఈ సమస్య తలెత్తినట్టు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ఆ ఐదుగురు విద్యార్థులను తిరిగి తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రిమాండ్‌ రిపోర్టులో మార్పులు చేసి సంబంధిత సెక్షన్లను పేర్కొంటూ న్యాయమూర్తికి సమర్పించినట్టు సమాచారం.

ఏపీ ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లిన విద్యార్థులపై పోలీసులు అత్యాచారయత్నం కేసుగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ముట్టడికి యత్నించిన ఐదుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో రిమాండ్‌ రిపోర్టులో అత్యాచార యత్నంగా పేర్కొనడంపై మంగళగిరి కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థుల సమస్యలపై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో సీఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఐదుగురు విద్యార్థి నేతలు సీఎం నివాసానికి అర కిలోమీటర్‌ దూరం వరకు వెళ్లగలిగారు. వారిని తెలుగు తల్లి విగ్రహం సమీపంలోనే పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఐదుగురిపైనా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. వారిని శనివారం మంగళగిరి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టు చూసిన న్యాయమూర్తి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ రిపోర్టులో అత్యాచారయత్నం అనే పదం వాడటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది అత్యాచారయత్నం కేసు ఎలా అవుతుందంటూ నిలదీసినట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు.. పాత ఎఫ్‌ఐఆర్‌ కాపీలను కంప్యూటర్‌లో మార్చే క్రమంలో ఆ పదాలను మార్చకుండా అలాగే వదిలేయడంతో ఈ సమస్య తలెత్తినట్టు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ఆ ఐదుగురు విద్యార్థులను తిరిగి తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రిమాండ్‌ రిపోర్టులో మార్పులు చేసి సంబంధిత సెక్షన్లను పేర్కొంటూ న్యాయమూర్తికి సమర్పించినట్టు సమాచారం.

ఇదీ చదవండి

ప్రభుత్వ సహాయ నిరాకరణ: పతాక స్థాయికి పంచాయతీ పోరు

Last Updated : Jan 23, 2021, 10:38 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.