ETV Bharat / state

పొలం కబ్జాకు వైకాపా నేతల యత్నం...కత్తితో పొడుచుకున్న కౌలు రైతు !

author img

By

Published : Dec 22, 2020, 1:07 PM IST

Updated : Dec 22, 2020, 5:20 PM IST

గుంటూరు జిల్లాలో కౌలు రైతు సలీం ఆత్మహత్యాయత్నం చేశాడు. పొలంలోనే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కొందరు వైకాపా నేతలు పొలాన్ని కబ్జా చేసేందుకు చూస్తున్నారని..స్థానిక ఎమ్మెల్యే అండదండలతో తన పంటను అధికారులు బలవంతంగా కోసేందుకు యత్నించారని ఆరోపించాడు.

కత్తితో పొడుచుకున్న కౌలు రైతు
కత్తితో పొడుచుకున్న కౌలు రైతు

గుంటూరు జిల్లా వేమూరు మండలం పోతుమర్రులో సలీం అనే కౌలు రైతు.. పొలంలోనే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సలీం.. పోతుమర్రు గ్రామంలోని పద్మావతికి చెందిన 7.5 ఎకరాల పొలం సాగు చేస్తున్నాడు. ఆ భూమి యాజమన్య హక్కుల విషయంలో పద్మావతికి, శివారెడ్డి అనే వ్యక్తికి మధ్య వివాదం ఉంది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో పంట పొలాన్ని ఎవరు కోయడానికి వీల్లేదని.. కోర్టు తీర్పు వచ్చే వరకు తమ అధీనంలో ఉంటుందని ఎమ్మార్వో నోటీసు జారీ చేశారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు పోలీసులు అక్కడ ఆంక్షలు విధించారు.

కత్తితో పొడుచుకున్న కౌలు రైతు

పంటపై తనకు పూర్తి హక్కులు ఉన్నాయని... సలీం అధికారుల్ని కలిసి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరికి పొలంలోనే ఆత్మహత్య చేసుకుంటానని సలీం ఓ వీడియో విడుదల చేశాడు. ఈ ఉదయం రెవెన్యూ, పోలీసు అధికారులు పొలం వద్దకు చేరుకోగానే సలీం కత్తి తీసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పక్కన ఉన్న వాళ్లు అతడిని ఆపేందుకు యత్నించినా.. అప్పటికే అతను కత్తితో పొడుచుకున్నాడు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు యత్నించగా నిరసన తెలిపాడు. ఎన్నిసార్లు చెప్పినా.... తన గోడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరికి పోలీసులు.. సలీంను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.

గుంటూరు జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

"పద్మావతి అనే మహిళ నుంచి 2018లో పొలాన్ని కౌలుకు తీసుకున్నా. కొందరు వైకాపా నేతలు ఆ పొలం కబ్జా చేసేందుకు చూశారు. మార్కెట్ యార్డ్‌ ఛైర్మన్, మరికొందరు నాపై పలుసార్లు దాడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అండతో ఎస్ఐ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. కష్టపడి పండించిన పంటను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. నేనూ వైకాపా కార్యకర్తనే, సీఎం స్పందించి న్యాయం చేయాలి."

-బాధితుడు సలీం

కత్తితో పొడుచుకున్న కౌలు రైతు

సలీంకు ప్రభుత్వఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. సలీం కత్తి గాయానికి చికిత్స చేస్తున్నట్లు గుంటూరు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

పలమనేరులో ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

గుంటూరు జిల్లా వేమూరు మండలం పోతుమర్రులో సలీం అనే కౌలు రైతు.. పొలంలోనే కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సలీం.. పోతుమర్రు గ్రామంలోని పద్మావతికి చెందిన 7.5 ఎకరాల పొలం సాగు చేస్తున్నాడు. ఆ భూమి యాజమన్య హక్కుల విషయంలో పద్మావతికి, శివారెడ్డి అనే వ్యక్తికి మధ్య వివాదం ఉంది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో పంట పొలాన్ని ఎవరు కోయడానికి వీల్లేదని.. కోర్టు తీర్పు వచ్చే వరకు తమ అధీనంలో ఉంటుందని ఎమ్మార్వో నోటీసు జారీ చేశారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు పోలీసులు అక్కడ ఆంక్షలు విధించారు.

కత్తితో పొడుచుకున్న కౌలు రైతు

పంటపై తనకు పూర్తి హక్కులు ఉన్నాయని... సలీం అధికారుల్ని కలిసి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరికి పొలంలోనే ఆత్మహత్య చేసుకుంటానని సలీం ఓ వీడియో విడుదల చేశాడు. ఈ ఉదయం రెవెన్యూ, పోలీసు అధికారులు పొలం వద్దకు చేరుకోగానే సలీం కత్తి తీసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పక్కన ఉన్న వాళ్లు అతడిని ఆపేందుకు యత్నించినా.. అప్పటికే అతను కత్తితో పొడుచుకున్నాడు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు యత్నించగా నిరసన తెలిపాడు. ఎన్నిసార్లు చెప్పినా.... తన గోడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరికి పోలీసులు.. సలీంను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.

గుంటూరు జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం

"పద్మావతి అనే మహిళ నుంచి 2018లో పొలాన్ని కౌలుకు తీసుకున్నా. కొందరు వైకాపా నేతలు ఆ పొలం కబ్జా చేసేందుకు చూశారు. మార్కెట్ యార్డ్‌ ఛైర్మన్, మరికొందరు నాపై పలుసార్లు దాడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అండతో ఎస్ఐ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. కష్టపడి పండించిన పంటను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. నేనూ వైకాపా కార్యకర్తనే, సీఎం స్పందించి న్యాయం చేయాలి."

-బాధితుడు సలీం

కత్తితో పొడుచుకున్న కౌలు రైతు

సలీంకు ప్రభుత్వఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. సలీం కత్తి గాయానికి చికిత్స చేస్తున్నట్లు గుంటూరు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

పలమనేరులో ప్రాణం తీసిన సెల్ఫీ సరదా

Last Updated : Dec 22, 2020, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.