గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా అనుమానిత కేసు నమోదైంది. కరోనా లక్షణాలతో ఉన్న ఓ యువతిని గుంటూరు ఐడి ఆస్పత్రికి తరలించారు. జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసంతో ఆమె బాధపడుతోంది. ఆమెను ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కరోనా నిర్ధారణ కోసం నమూనాలు సేకరించి తిరుపతికి పంపారు అధికారులు. ఆమె ఇటీవలే విదేశాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి...తెలంగాణలో... ఒక్కరోజే ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు