ETV Bharat / state

జిల్లాలో వెయ్యికి చేరిన కరోనా కేసులు

author img

By

Published : Jun 24, 2020, 8:18 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతునే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 70పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,014కు చేరింది. గుంటూరు నగరంలోనే ఇప్పటివరకూ 367 పాజటివ్ కేసులు నమోదయ్యాయి.

corona cases increasing in guntur dst
corona cases increasing in guntur dst

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే జిల్లాలో 70 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 1,014కు చేరింది. కొత్త కేసుల్లో గుంటూరు నగరంలో 27 తెనాలిలో 13, తాడేపల్లి 12, నరసరావుపేట 3, మాచర్ల 2, మంగళగిరి 5, బాపట్ల 2 పాజిటివ్ కేసులు వచ్చాయి.

అలాగే సత్తెనపల్లి, నంబూరు, నిజాంపట్నం, పెదనందిపాడు, కనపర్రు, రేవేంద్రపాడులో 1 చొప్పున నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ పాజిటివ్​గా తేలిన వారిలో 10మంది ఇప్పటికే క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. గుంటూరు నగరంలో అంకిరెడ్డి పాలెంలో2, డీయస్​ నగర్ 1, వెంకట రామయ్య కాలనీ 1, ఏ.టి అగ్రహారం 1, పట్టాభిపురం 2, ఆర్టీసీ కాలనీ 1 , కే వీపీ కాలనీ 1, గుండరావుపేట 1, నల్లచేరువు 1, ఐపీడీ కాలనీ 6, కాటూరి మెడికల్ కాలేజ్ క్వారంటైన్ 3, బృందావన్ గార్డెన్స్ 1, సంగడిగుంట 3, లాలపేట 1, చౌడవరం 1, శ్యామలా నగర్ 1 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి గుంటూరు నగరంలో కేసుల సంఖ్య 367, నరసారావుపేటలో 232, తాడేపల్లిలో 109, తెనాలిలో 37, మంగళగిరిలో 26, మాచర్లలో 17కు చేరుకున్నాయి.

దాచేపల్లి మండలం పొందుగుల క్యారంటైన్​ సెంటర్​లో ఆయుష్ మందులను ఇతర రాష్ట్రాల నుంచి వారికి పంపిణీ చేశారు.

ఇదీ చూడండి

కాపు నేస్తం'తో కాపుల్లో మరింత ధైర్యం వచ్చింది: జక్కంపూడి రాజా

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే జిల్లాలో 70 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 1,014కు చేరింది. కొత్త కేసుల్లో గుంటూరు నగరంలో 27 తెనాలిలో 13, తాడేపల్లి 12, నరసరావుపేట 3, మాచర్ల 2, మంగళగిరి 5, బాపట్ల 2 పాజిటివ్ కేసులు వచ్చాయి.

అలాగే సత్తెనపల్లి, నంబూరు, నిజాంపట్నం, పెదనందిపాడు, కనపర్రు, రేవేంద్రపాడులో 1 చొప్పున నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ పాజిటివ్​గా తేలిన వారిలో 10మంది ఇప్పటికే క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. గుంటూరు నగరంలో అంకిరెడ్డి పాలెంలో2, డీయస్​ నగర్ 1, వెంకట రామయ్య కాలనీ 1, ఏ.టి అగ్రహారం 1, పట్టాభిపురం 2, ఆర్టీసీ కాలనీ 1 , కే వీపీ కాలనీ 1, గుండరావుపేట 1, నల్లచేరువు 1, ఐపీడీ కాలనీ 6, కాటూరి మెడికల్ కాలేజ్ క్వారంటైన్ 3, బృందావన్ గార్డెన్స్ 1, సంగడిగుంట 3, లాలపేట 1, చౌడవరం 1, శ్యామలా నగర్ 1 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి గుంటూరు నగరంలో కేసుల సంఖ్య 367, నరసారావుపేటలో 232, తాడేపల్లిలో 109, తెనాలిలో 37, మంగళగిరిలో 26, మాచర్లలో 17కు చేరుకున్నాయి.

దాచేపల్లి మండలం పొందుగుల క్యారంటైన్​ సెంటర్​లో ఆయుష్ మందులను ఇతర రాష్ట్రాల నుంచి వారికి పంపిణీ చేశారు.

ఇదీ చూడండి

కాపు నేస్తం'తో కాపుల్లో మరింత ధైర్యం వచ్చింది: జక్కంపూడి రాజా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.