ETV Bharat / state

జిల్లాలో కొత్తగా 14 మందికి కరోనా.. 645కు చేరిన కేసులు

author img

By

Published : Jun 15, 2020, 3:55 AM IST

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం జిల్లాలో మరో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 645కు చేరింది.

corona cases increases in guntur district
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా మరో 14 కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలో సంపత్ నగర్, కోబాల్డ్ పేట, కొత్తపేటలో కేసులు బయటపడ్డాయి. నరసరావుపేట, తాడేపల్లిలో 3 చొప్పున నమోదయ్యాయి. చిలకలూరిపేట, మాదలలో ఒక్కొక్క కేసు వెలుగుచూసింది. ముగ్గురు ఎన్నారై పీజీ విద్యార్ధులకు కరోనా సోకింది.

జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 645కు చేరింది. గుంటూరు, నరసరావుపేటలో మళ్లీ కరోనా కేసులు బయట పడుతుండగా.. తాడేపల్లిలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం కొత్తగా మరో 14 కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలో సంపత్ నగర్, కోబాల్డ్ పేట, కొత్తపేటలో కేసులు బయటపడ్డాయి. నరసరావుపేట, తాడేపల్లిలో 3 చొప్పున నమోదయ్యాయి. చిలకలూరిపేట, మాదలలో ఒక్కొక్క కేసు వెలుగుచూసింది. ముగ్గురు ఎన్నారై పీజీ విద్యార్ధులకు కరోనా సోకింది.

జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 645కు చేరింది. గుంటూరు, నరసరావుపేటలో మళ్లీ కరోనా కేసులు బయట పడుతుండగా.. తాడేపల్లిలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఇదీ చూడండి..

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి.. 17 నుంచి కర్ణాటకకు బస్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.