గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలం సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొవిడ్ -19 పరీక్షలు చేశారు. కొద్ది రోజుల క్రితం పాఠశాల ఉపాధ్యాయుడు అస్వస్థతకు లోనయ్యారు. అనుమానం వచ్చిన ఆయన కరోనా పరీక్షలు చేయించుకోవటంతో పాజిటివ్గా వచ్చింది. భయందోళనకు గురైన సిబ్బంది 200 మందికి కోవిడ్ పరీక్షలు చేయించారు. గదుల్లో శానిటైజేషన్ చేశారు.
ఇవీ చదవండి: