ETV Bharat / state

గుంటూరులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

కరోనా మహమ్మారి రోజురోజుకీ భయపెడుతోంది. గుంటూరులో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. పోలీసులు లాక్‌డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నారు. రెడ్ జోన్ల నుంచి వేరే మండలాలకు రాకపోకలు పూర్తిగా నిషేధించారు.

author img

By

Published : Apr 21, 2020, 3:21 PM IST

Updated : Apr 21, 2020, 4:07 PM IST

గుంటూరులో 149 కరోనా పాజిటివ్ కేసులు
గుంటూరులో 149 కరోనా పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. జిల్లాలో ఇవాళ కొత్తగా 9 కేసులు నమోదు కాగా... మొత్తం సంఖ్య 158కి చేరుకుంది. పాజిటివ్ రోగుల సంఖ్య గుంటూరు నగరంలోనే అధికంగా ఉంది. ప్రస్తుతం గుంటూరు నగరంలో 101 మందికి కరోనా సోకింది. నరసరావుపేటలో ఇప్పటి వరకూ 29మందికి కరోనా సోకింది. ఈ రెండు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. లాక్​డౌన్​ను పక్కాగా అమలు చేస్తున్నారు. రోడ్లపైకి 9గంటల తర్వాత ఎవరినీ రానీయటం లేదు. జిల్లాలో రెడ్ జోన్ల నుంచి వేరే మండలాలకు రాకపోకలు పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత మండలాల్లో విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు.

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. జిల్లాలో ఇవాళ కొత్తగా 9 కేసులు నమోదు కాగా... మొత్తం సంఖ్య 158కి చేరుకుంది. పాజిటివ్ రోగుల సంఖ్య గుంటూరు నగరంలోనే అధికంగా ఉంది. ప్రస్తుతం గుంటూరు నగరంలో 101 మందికి కరోనా సోకింది. నరసరావుపేటలో ఇప్పటి వరకూ 29మందికి కరోనా సోకింది. ఈ రెండు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. లాక్​డౌన్​ను పక్కాగా అమలు చేస్తున్నారు. రోడ్లపైకి 9గంటల తర్వాత ఎవరినీ రానీయటం లేదు. జిల్లాలో రెడ్ జోన్ల నుంచి వేరే మండలాలకు రాకపోకలు పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత మండలాల్లో విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చదవండి: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ పరిస్థితి విషమం!

Last Updated : Apr 21, 2020, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.