ETV Bharat / state

జిల్లాలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 89 కేసులు నమోదు

author img

By

Published : Dec 8, 2020, 7:31 PM IST

గుంటూరు జిల్లాలో నేడు కొత్తగా 89 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73,573కి చేరింది. ఈరోజు వైరస్​తో ఒకరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 654కి చేరింది.

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. జిల్లాలో కొత్తగా 89 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73,573కి చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 21 కేసులు ఉన్నాయి. బాపట్ల-12, అమరావతి-6, నరసరావుపేటలో-6 కేసుల చొప్పున నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 72,076 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ బారిన పడి గుంటూరులో మరొకరు మృతి చెందారు. దీనితో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 654కి చేరింది.

గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. జిల్లాలో కొత్తగా 89 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73,573కి చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 21 కేసులు ఉన్నాయి. బాపట్ల-12, అమరావతి-6, నరసరావుపేటలో-6 కేసుల చొప్పున నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 72,076 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ బారిన పడి గుంటూరులో మరొకరు మృతి చెందారు. దీనితో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 654కి చేరింది.

ఇవీ చదవండి..

'వాలంటీర్ల తొలగింపు ప్రచారం వాస్తవం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.