ETV Bharat / state

అంగన్​వాడీలకు ప్రత్యేక యాప్​... స్త్రీల కోసం వన్​స్టాప్ సెంటర్లు

మూడు సంవత్సరాలలో అంగన్​వాడీ కేంద్రాల రూపురేఖలను మార్చాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చే్శారు. అలాగే మహిళల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు గ్రామ సచివాలయాల్లో వన్​స్టాప్​ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదే్శించారు.

author img

By

Published : Sep 10, 2019, 7:11 AM IST

జగన్

రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాలను మూడేళ్లలో పాఠశాలల తరహాలో ఆధునీకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. మహిళలకు పౌష్టికాహారం అందించడం సహా శిశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మహిళా శిశుసంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి సోమవారం సమీక్షించారు. అంగన్​వాడీల నుంచి స్కూళ్లలో చేరని దాదాపు ఏడువేల మంది బాలలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి బడిబాట పట్టేలా చేయాలని సీఎం ఆదేశించారు. అంగన్‌వాడీలపై ప్రత్యేక యాప్‌ తయారుచేయాలని సీఎం సూచించారు. దీనికి ఎన్నారైలు, సంస్థలు, దాతల సహాయం తీసుకుందామన్న సీఎం... ఎవరు సహాయం చేసినా వారి పేర్లు పెడతామన్నారు. దీనికోసం పోర్టల్‌ రూపకల్పనకు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. మహిళా, శిశు సంక్షేమంలో గ్రామవాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించాలని సీఎం ఆదేశించారు. శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మద్యానికి బానిసలైన వారి కోసం కౌన్సెలింగ్‌ సెంటర్ల ఏర్పాటు అంశంపై దృష్టి పెట్టాలన్నారు. దివ్యాంగుల విషయంలో ఉదారంగా ఉండాలని...ఎలాంటి పరికరాలు కావాలన్నా అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మహిళల కోసం వన్​స్టాప్​ సెంటర్లు

గ్రామ సచివాలయాల నుంచి వస్తున్న అత్యవసర విషయాలపై ప్రభుత్వం, యంత్రాంగం స్పందించేందుకు ఒక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలోనూ మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వన్​స్టాప్​ సెంటర్లు ఏర్పాటు చేయాలని, మహిళా పోలీసుల సేవలను ఇందుకు వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. వేధింపులకు గురైన మహిళలకు ఇవ్వాల్సిన పరిహారం కోసం 7.48 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. బాధితులకు సహాయం చేయడానికి ఒక్కో జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయల చొప్పన నిధిని కేటాయించాలని సీఎం ఆదేశించారు.

గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అంశంపై చర్చించిన సీఎం.... భూ వివాదాల వంటి వాటిని దశాబ్దాల తరబడి నాన్చే పరిస్థితి ఉండకూడదన్నారు. బయోమెట్రిక్‌, ఐరిస్‌ వంటి విధానాలు ఆ పథకం లబ్ధిదారుడికి చేరిందనే దానికి ఆధారం తప్ప, నిరాకరించడానికి కాదని సీఎం స్పష్టం చేశారు

రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాలను మూడేళ్లలో పాఠశాలల తరహాలో ఆధునీకరించాలని సీఎం జగన్ ఆదేశించారు. మహిళలకు పౌష్టికాహారం అందించడం సహా శిశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మహిళా శిశుసంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి సోమవారం సమీక్షించారు. అంగన్​వాడీల నుంచి స్కూళ్లలో చేరని దాదాపు ఏడువేల మంది బాలలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి బడిబాట పట్టేలా చేయాలని సీఎం ఆదేశించారు. అంగన్‌వాడీలపై ప్రత్యేక యాప్‌ తయారుచేయాలని సీఎం సూచించారు. దీనికి ఎన్నారైలు, సంస్థలు, దాతల సహాయం తీసుకుందామన్న సీఎం... ఎవరు సహాయం చేసినా వారి పేర్లు పెడతామన్నారు. దీనికోసం పోర్టల్‌ రూపకల్పనకు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. మహిళా, శిశు సంక్షేమంలో గ్రామవాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించాలని సీఎం ఆదేశించారు. శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మద్యానికి బానిసలైన వారి కోసం కౌన్సెలింగ్‌ సెంటర్ల ఏర్పాటు అంశంపై దృష్టి పెట్టాలన్నారు. దివ్యాంగుల విషయంలో ఉదారంగా ఉండాలని...ఎలాంటి పరికరాలు కావాలన్నా అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మహిళల కోసం వన్​స్టాప్​ సెంటర్లు

గ్రామ సచివాలయాల నుంచి వస్తున్న అత్యవసర విషయాలపై ప్రభుత్వం, యంత్రాంగం స్పందించేందుకు ఒక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలోనూ మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వన్​స్టాప్​ సెంటర్లు ఏర్పాటు చేయాలని, మహిళా పోలీసుల సేవలను ఇందుకు వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. వేధింపులకు గురైన మహిళలకు ఇవ్వాల్సిన పరిహారం కోసం 7.48 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. బాధితులకు సహాయం చేయడానికి ఒక్కో జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయల చొప్పన నిధిని కేటాయించాలని సీఎం ఆదేశించారు.

గ్రామ న్యాయాలయాల ఏర్పాటు అంశంపై చర్చించిన సీఎం.... భూ వివాదాల వంటి వాటిని దశాబ్దాల తరబడి నాన్చే పరిస్థితి ఉండకూడదన్నారు. బయోమెట్రిక్‌, ఐరిస్‌ వంటి విధానాలు ఆ పథకం లబ్ధిదారుడికి చేరిందనే దానికి ఆధారం తప్ప, నిరాకరించడానికి కాదని సీఎం స్పష్టం చేశారు

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వినాయక ఉత్సవాల సందర్భంగా ఏకాదశి వసంతోత్సవం వేదపండితుల ఘనంగా నిర్వహించారు స్వామివారికి సహస్ర కమల అర్చన సహస్ర తమళార్చన, కుంకుమార్చన,పుష్పాలతో పూజలు చేసారు. వేద పండితులు వేద మంత్రాలతో నమకం చమకం శ్రీ సూక్తం పురుష సూక్తం సువర్ణ మంత్ర పుష్పం ఘనంగా అభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో వేద పండితులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.8008574248.Body:ఘనంగా వినాయక చవితి ఉత్సవాలుConclusion:8008574248
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.