ETV Bharat / state

ట్యాంకర్, ద్విచక్రవాహనం ఢీ...వ్యక్తి మృతి

పాల ట్యాంకర్, ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా వినుకొండలో జరిగింది. ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉండగా... ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

author img

By

Published : Aug 1, 2020, 9:34 AM IST

ట్యాంకర్, ద్విచక్రవాహనం ఢీ...వ్యక్తి మృతి
ట్యాంకర్, ద్విచక్రవాహనం ఢీ...వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఇరిగేషన్ శాఖలో విధులు నిర్వహిస్తున్న రెడ్డిబోయిన యేసుదాసుగా గుర్తించారు. వినుకొండలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి నూజెండ్లకి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా...పాల డైరీ ట్యాంకర్ ఢీ కొట్టింది. యేసుదాసును 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉండగా.. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీచదవండి

గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాల ట్యాంకర్, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఇరిగేషన్ శాఖలో విధులు నిర్వహిస్తున్న రెడ్డిబోయిన యేసుదాసుగా గుర్తించారు. వినుకొండలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి నూజెండ్లకి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా...పాల డైరీ ట్యాంకర్ ఢీ కొట్టింది. యేసుదాసును 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ట్యాంకర్ డ్రైవర్ పరారీలో ఉండగా.. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీచదవండి

లారీ కిందపడి ద్విచక్ర వాహనదారుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.