ETV Bharat / state

'పల్నాడు ప్రశాంతం... తెదేపా ప్రచారం అవాస్తవం'

పల్నాడులో దాడులు, తెదేపా పునరావాస శిబిరంపై..హోంమంత్రి సుచరిత విలేకరుల సమావేశం నిర్వహించారు. నిజంగా బాధితులు ఉంటే వారికి భద్రత కల్పిస్తామన్నారు. గ్రామాల్లో పోలీసులు అధికారులు పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. తెదేపా చెప్పినట్లు పల్నాడులో దాడులు లేవని, డబ్బులు ఇచ్చి కొందరిని బాధితులుగా సృష్టిస్తున్నారన్నారు. పల్నాడు ప్రశాంతంగా ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు.

author img

By

Published : Sep 9, 2019, 6:06 PM IST

పల్నాడు ప్రశాంతం... తెదేపా అవాస్తవాలు ప్రచారం చేస్తోంది : హోంమంత్రి
పల్నాడు ప్రశాంతం... తెదేపా అవాస్తవాలు ప్రచారం చేస్తోంది : హోంమంత్రి

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో దాడులపై రాష్ట్ర హోంమంత్రి సుచరిత స్పందించారు. తెదేపా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఆమె అన్నారు. రాజకీయ కేసులన్నీ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సమీక్షిస్తామని తెలిపారు. ఎన్నికల తర్వాత గ్రామాల్లో 46 మందిపై రౌడీషీట్లు, 36 మందిపై సస్పెక్ట్‌ షీట్లు నమోదు చేశామని ప్రకటించారు. రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌లు నిర్వహించామన్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తోన్న స్పందన కార్యక్రమంలో ప్రజలు చేసిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.

భద్రత కల్పిస్తాం
ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా సాగుతున్నాయని సుచరిత తెలిపారు. పల్నాడులో జరుగుతున్న అక్రమ మైనింగ్​పై గురువాచారి అనే వ్యక్తి ఫిర్యాదు చేసినందుకు గతంలో తెదేపా నేతలు వేధించారని ఆరోపించారు. గ్రామాల్లో ఉండలేని పరిస్థితులు ఉన్నాయని తెదేపా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని సుచరిత అన్నారు. డబ్బులు ఇచ్చి కొందరిని పునరావాస కేంద్రాల్లో పెట్టారని ఆమె ఆరోపించారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రత కల్పిస్తామని తెలిపారు. పోలీసులు పల్నాడు గ్రామాల్లో పర్యటించి పరిస్థితులు సమీక్షిస్తారని అన్నారు. శిబిరాల్లో నిజంగా బాధితులు ఉంటే వారికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

పల్నాడు ప్రశాంతం
రాష్ట్రంలో ఎక్కడా శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితులు లేవన్నారు. పల్నాడు ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని సీఎం స్పష్టంగా చెప్పారని సుచరిత అన్నారు.

ఇదీ చదవండి : పల్నాడులో ప్రశాంత వాతావరణం: ఐజీ వినీత్‌ బ్రిజ్​​లాల్‌

పల్నాడు ప్రశాంతం... తెదేపా అవాస్తవాలు ప్రచారం చేస్తోంది : హోంమంత్రి

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో దాడులపై రాష్ట్ర హోంమంత్రి సుచరిత స్పందించారు. తెదేపా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఆమె అన్నారు. రాజకీయ కేసులన్నీ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సమీక్షిస్తామని తెలిపారు. ఎన్నికల తర్వాత గ్రామాల్లో 46 మందిపై రౌడీషీట్లు, 36 మందిపై సస్పెక్ట్‌ షీట్లు నమోదు చేశామని ప్రకటించారు. రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌లు నిర్వహించామన్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తోన్న స్పందన కార్యక్రమంలో ప్రజలు చేసిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.

భద్రత కల్పిస్తాం
ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా సాగుతున్నాయని సుచరిత తెలిపారు. పల్నాడులో జరుగుతున్న అక్రమ మైనింగ్​పై గురువాచారి అనే వ్యక్తి ఫిర్యాదు చేసినందుకు గతంలో తెదేపా నేతలు వేధించారని ఆరోపించారు. గ్రామాల్లో ఉండలేని పరిస్థితులు ఉన్నాయని తెదేపా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని సుచరిత అన్నారు. డబ్బులు ఇచ్చి కొందరిని పునరావాస కేంద్రాల్లో పెట్టారని ఆమె ఆరోపించారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రత కల్పిస్తామని తెలిపారు. పోలీసులు పల్నాడు గ్రామాల్లో పర్యటించి పరిస్థితులు సమీక్షిస్తారని అన్నారు. శిబిరాల్లో నిజంగా బాధితులు ఉంటే వారికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

పల్నాడు ప్రశాంతం
రాష్ట్రంలో ఎక్కడా శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితులు లేవన్నారు. పల్నాడు ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని సీఎం స్పష్టంగా చెప్పారని సుచరిత అన్నారు.

ఇదీ చదవండి : పల్నాడులో ప్రశాంత వాతావరణం: ఐజీ వినీత్‌ బ్రిజ్​​లాల్‌

Intro:కుళ్లాయస్వామికి నిత్య పూజ నివేదన....

నార్పల మండలం గూగుడు గ్రామంలో కుళ్లాయస్వామికి నిత్యపూజ నివేదన క్కార్యక్రమంకు వేలాదిగ భక్తులు తరలివచ్చారు.

గూగుడు జంట దేవాలయాలు మతాలకు ప్రతీకగా ఆంజనేయ స్వామి , కుళ్లాయస్వామి కొలువుతీరారు.

కుళ్లాయ స్వామికి మొక్కు కుంటే తమ కోర్కెలు తీరుస్తాడని అంటున్నారు.

బైట్ 1: లక్ష్మమ్మ భక్తురాలు

బైట్ 2: నాగలక్ష్మమ్మ భక్తురాలు


Body:సింగనమల


Conclusion:కాంట్రిబ్యుటర్ : ఉమెష్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.