ETV Bharat / state

Sonusood: 'మీ వెంటే నేను'.. అమరావతి రైతులతో సోనూసూద్‌

author img

By

Published : Sep 9, 2021, 6:24 PM IST

Updated : Sep 9, 2021, 7:25 PM IST

ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని ఆందోళన చేస్తున్న రైతులకు సినీ నటుడు సోనూసూద్ మద్దతుగా నిలిచారు. రైతుల వెంటే తాను ఉంటానని స్పష్టం చేశారు.

సోనూసూద్‌
సోనూసూద్‌
అమరావతి రైతులకు సోనూసూద్‌ మద్దతు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 632 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు సినీనటుడు సోనూసూద్‌ మద్దతు ప్రకటించారు. విజయవాడ పర్యటనకు వచ్చిన సోనూసూద్​ను గన్నవరం విమానాశ్రయంలో మహిళా రైతులు కలిశారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరగా.. రైతుల వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. రాజధాని గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, పెదపరిమి దీక్షా శిబిరాల్లో నిరసన తెలిపారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్‌

విజయవాడ పర్యటనకు వచ్చిన సోనూసూద్​ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. కరోనా కష్టకాలం నుంచి ప్రజలంతా కోలుకుని తిరిగి సాధారణ జీవనం సాగించేలా కనకదుర్గమ్మ తన చల్లని ఆశీస్సులు అందించాలని ప్రార్థించినట్టు సోనూసూద్‌ తెలిపారు. ఆలయానికి వచ్చిన అతనికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం సిబ్బంది .. దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం పలికారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

ఇదీ చదవండి: SONUSOOD: విజయవాడ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న సోనూసూద్

అమరావతి రైతులకు సోనూసూద్‌ మద్దతు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 632 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు సినీనటుడు సోనూసూద్‌ మద్దతు ప్రకటించారు. విజయవాడ పర్యటనకు వచ్చిన సోనూసూద్​ను గన్నవరం విమానాశ్రయంలో మహిళా రైతులు కలిశారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరగా.. రైతుల వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. రాజధాని గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అనంతవరం, పెదపరిమి దీక్షా శిబిరాల్లో నిరసన తెలిపారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.

దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్‌

విజయవాడ పర్యటనకు వచ్చిన సోనూసూద్​ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. కరోనా కష్టకాలం నుంచి ప్రజలంతా కోలుకుని తిరిగి సాధారణ జీవనం సాగించేలా కనకదుర్గమ్మ తన చల్లని ఆశీస్సులు అందించాలని ప్రార్థించినట్టు సోనూసూద్‌ తెలిపారు. ఆలయానికి వచ్చిన అతనికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం సిబ్బంది .. దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం పలికారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.

ఇదీ చదవండి: SONUSOOD: విజయవాడ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్న సోనూసూద్

Last Updated : Sep 9, 2021, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.