ETV Bharat / state

ఎన్నాళ్లో! జల్లేరు దాటే ప్రజల అవస్థలు - ఐదేళ్లుగా నిలిచిన ఆర్టీసీ సేవలు - TRIBALS DEMAND FOR JALLERU VAGU

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జల్లేరు వాగుపై పూర్తికాని వంతెన నిర్మాణం - తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

Tribals Demand Construction Of Bridge Over Jalleru Vagu
Tribals Demand Construction Of Bridge Over Jalleru Vagu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2025, 8:49 PM IST

Tribals Demand Construction Of Bridge Over Jalleru Vagu : ఆ వాగుపై వంతెన నిర్మాణం గిరిజనుల కల. ఏజెన్సీ ముఖద్వారంగా చెప్పుకునే ఆ ప్రాంతం నుంచి అటు తెలంగాణ, ఇటు ఏలూరు జిల్లాకు రావాలంటే ఆ వాగు దాటాల్సిందే. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభమై ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోక నేటికీ ఆ మార్గంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారింది.

వంతెన నిర్మాణం గాలికి : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి ఏజెన్సీ ప్రాంతాలతోపాటు తెలంగాణకు వెళ్లే రహదారి ఇది. ఈ మార్గంలో పట్టెనపాలెం వద్ద జల్లేరు వాగుపై వంతెన లేక ప్రయాణికులు నరకం చూస్తున్నారు. 2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జల్లేరు వాగుపై హైలెవల్ వంతెనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం దిగిపోయే నాటికి పిల్లర్లు పూర్తి చేసి ఓ వైపు శ్లాబు నిర్మాణం చేపట్టారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వంతెన నిర్మాణం గాలికొదిలేసింది. రెండు వైపులా అప్రోచ్ రోడ్లు వేసి, పైన శ్లాబులు పూర్తి చేస్తే వంతెన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా వైఎస్సార్సీపీ నాయకులు పట్టించుకున్న పాపానపోలేదు.

పూర్తి కాకుండానే శిథిలావస్థకు : వంతెన పూర్తి కాక, కల్వర్టు నిర్మాణం రాళ్లు తేలి అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ మార్గం గుండా ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వాగులో దిగి ఎక్కే క్రమంలో వాహనాలు అదుపుతప్పి పడిపోయి కొంతమంది గాయపడిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక వర్షాకాలంలో వరదతో ఈ వాగు పోటెత్తుతుంది. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టే వరకు రాకపోకలు సాగించడానికి వీలుండదు. వైఎస్సార్సీపీ పాలకులు నిర్మాణ పనులు పట్టించుకోక పిచ్చి మొక్కలు మొలిచి పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితిలో వంతెన కనిపిస్తోంది.

40 గ్రామాలకు ఇదే మార్గం : జల్లేరు వాగు అవతలివైపున ఉన్న సుమారు 40కి పైగా గ్రామాలకు ఇదే మార్గం. ఐదేళ్లుగా ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. వర్షాకాలంలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఏజెన్సీ మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరుకు వెళ్లేందుకూ ఇదే ప్రధానమార్గం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికీ ఈ వాగు దాటుకునే వెళ్లాలి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రహదారిలో వంతెన నిర్మాణం కలగా మారింది.

ఉప్పొంగిన కట్టలేరు- వంతెనమీదుగా రాకపోకలు నిలిపివేత - Kattaleru Vagu Over flowing

"బుడమేరూ నువ్వెందుకు బుస కొట్టావ్?" - "నా భూములు కబ్జా చేస్తే ఊరుకుంటానా!" - Budameru Vagu Encroachments

Tribals Demand Construction Of Bridge Over Jalleru Vagu : ఆ వాగుపై వంతెన నిర్మాణం గిరిజనుల కల. ఏజెన్సీ ముఖద్వారంగా చెప్పుకునే ఆ ప్రాంతం నుంచి అటు తెలంగాణ, ఇటు ఏలూరు జిల్లాకు రావాలంటే ఆ వాగు దాటాల్సిందే. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభమై ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోక నేటికీ ఆ మార్గంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారింది.

వంతెన నిర్మాణం గాలికి : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి ఏజెన్సీ ప్రాంతాలతోపాటు తెలంగాణకు వెళ్లే రహదారి ఇది. ఈ మార్గంలో పట్టెనపాలెం వద్ద జల్లేరు వాగుపై వంతెన లేక ప్రయాణికులు నరకం చూస్తున్నారు. 2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జల్లేరు వాగుపై హైలెవల్ వంతెనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం దిగిపోయే నాటికి పిల్లర్లు పూర్తి చేసి ఓ వైపు శ్లాబు నిర్మాణం చేపట్టారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వంతెన నిర్మాణం గాలికొదిలేసింది. రెండు వైపులా అప్రోచ్ రోడ్లు వేసి, పైన శ్లాబులు పూర్తి చేస్తే వంతెన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా వైఎస్సార్సీపీ నాయకులు పట్టించుకున్న పాపానపోలేదు.

పూర్తి కాకుండానే శిథిలావస్థకు : వంతెన పూర్తి కాక, కల్వర్టు నిర్మాణం రాళ్లు తేలి అంతంతమాత్రంగానే ఉండటంతో ఈ మార్గం గుండా ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వాగులో దిగి ఎక్కే క్రమంలో వాహనాలు అదుపుతప్పి పడిపోయి కొంతమంది గాయపడిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక వర్షాకాలంలో వరదతో ఈ వాగు పోటెత్తుతుంది. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టే వరకు రాకపోకలు సాగించడానికి వీలుండదు. వైఎస్సార్సీపీ పాలకులు నిర్మాణ పనులు పట్టించుకోక పిచ్చి మొక్కలు మొలిచి పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితిలో వంతెన కనిపిస్తోంది.

40 గ్రామాలకు ఇదే మార్గం : జల్లేరు వాగు అవతలివైపున ఉన్న సుమారు 40కి పైగా గ్రామాలకు ఇదే మార్గం. ఐదేళ్లుగా ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. వర్షాకాలంలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఏజెన్సీ మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరుకు వెళ్లేందుకూ ఇదే ప్రధానమార్గం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికీ ఈ వాగు దాటుకునే వెళ్లాలి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రహదారిలో వంతెన నిర్మాణం కలగా మారింది.

ఉప్పొంగిన కట్టలేరు- వంతెనమీదుగా రాకపోకలు నిలిపివేత - Kattaleru Vagu Over flowing

"బుడమేరూ నువ్వెందుకు బుస కొట్టావ్?" - "నా భూములు కబ్జా చేస్తే ఊరుకుంటానా!" - Budameru Vagu Encroachments

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.