ETV Bharat / state

సీసీ కెమెరాలు అమరుస్తుండగా.. యువకుడి మృత్యువాత

తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం సీతాపురం గ్రామంలో సీసీ కెమెరాలు అమరుస్తుండగా విద్యుతాఘాతంతో చుక్కా లక్ష్మణ్ అనే యువకుడు మరణించాడు.

author img

By

Published : Sep 18, 2019, 8:21 PM IST

సీసీ కెమెరాలు అమరుస్తుండగా యువకుడి మృత్యువాత
సీసీ కెమెరాలు అమరుస్తుండగా యువకుడి మృత్యువాత

తెలంగాణలోని భద్రాచలం పట్టణం, ముదిరాజ్ బజార్ కు చెందిన 18 సంవత్సరాల చుక్క లక్ష్మణ్ ఎలక్ట్రీషియన్. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం సీతాపురం గ్రామంలో ఓ ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చేందుకు స్నేహితుడు మూర్తితో కలిసి వెళ్లాడు. అవసరమైన అన్ని చోట్ల కెమెరాలను అమర్చాడు. పని ముగిసిన అనంతరం వాటిని మరోసారి పరీక్షించేందుకు వైర్లను పట్టుకోగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన వారు అప్రమత్తమై విద్యుత్ సరఫరా ఆపివేశారు. అపస్మారక స్థితికి చేరిన లక్ష్మణ్ ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కుటుంబ పోషణ కోసం పనికెళ్లిన కుమారుడు మృత్యు ఒడికి చేరాడంటూ అతని కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు.

సీసీ కెమెరాలు అమరుస్తుండగా యువకుడి మృత్యువాత

తెలంగాణలోని భద్రాచలం పట్టణం, ముదిరాజ్ బజార్ కు చెందిన 18 సంవత్సరాల చుక్క లక్ష్మణ్ ఎలక్ట్రీషియన్. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం సీతాపురం గ్రామంలో ఓ ఇంట్లో సీసీ కెమెరాలు అమర్చేందుకు స్నేహితుడు మూర్తితో కలిసి వెళ్లాడు. అవసరమైన అన్ని చోట్ల కెమెరాలను అమర్చాడు. పని ముగిసిన అనంతరం వాటిని మరోసారి పరీక్షించేందుకు వైర్లను పట్టుకోగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన వారు అప్రమత్తమై విద్యుత్ సరఫరా ఆపివేశారు. అపస్మారక స్థితికి చేరిన లక్ష్మణ్ ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కుటుంబ పోషణ కోసం పనికెళ్లిన కుమారుడు మృత్యు ఒడికి చేరాడంటూ అతని కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు.

ఇదీ చదవండి:

రహదారి పక్కన శిశువుకు జననం.. స్థానికుల సాయం

Intro:ap_tpg_81_18_vedavyasaalaya_ab_ap10162


Body:ప్రతి ఒక్కరూ సద్భావంతో అంతా సంతోషంగా ఉండాలని అని కోరుకుంటూ మనిషిలో సంతోషం పెరుగుతుందని భగవంతుడు మన సంతోషం పై దృష్టి సారిస్తానని bhavaghni గురువు అన్నారు దెందులూరు మండలం గంగన్నగూడెం లో ఇందుకు సంబంధించి జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు అమరావతిలోని వైకుంటపురం లో నిర్మించే భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన క్షేత్రం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు పారాయణం చేస్తే చాలదని అందులోనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు కాలక్షేపం కోసం గ్రంథాలు చదవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు కొందరు ఏమి చేయాలో తెలియక ఇష్టానుసారంగా చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలుగ చేస్తారన్నారు మనిషి పోతు ఏమీ పట్టికలో లేడని దీనిని ప్రతి ఒక్కరు గ్రహించాలన్నారు ధర్మం గురించి తెలుసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు కోరికలు తీరలేదని దేవుళ్లను మార్చే వారు చాలా మంది ఉన్నారు అనంతరం గ్రామస్తులకు ఇటుకలను అందజేశారు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.