ETV Bharat / state

అవినీతి కేసుల విచారణకు యానాంలో విజిలెన్స్ క్యాంప్ - east godavai district yanam camp office news today

యానాంలో విజిలెన్స్ సహా ఏసీబీ సంయుక్త ఆధ్వర్యంలో అవినీతి ఉద్యోగుల కేసు విచారణకు క్యాంపు ఏర్పాటైంది. ఇప్పటివరకు రాజధాని పుదుచ్చేరిలోనే విచారణలు జరిగేవని.. ఇకపై యానాంలోనూ విచారణ క్యాంపులు నిర్వహిస్తామని పుదుచ్చేరి సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆకాంక్ష యాదవ్ తెలిపారు.

'అవినీతి కేసుల విచారణకు యానాంలో విజిలెన్స్ క్యాంప్'
'అవినీతి కేసుల విచారణకు యానాంలో విజిలెన్స్ క్యాంప్'
author img

By

Published : Nov 11, 2020, 5:51 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత యానాంలో విజిలెన్స్ సహా అవినీతి నిరోధక శాఖ సంయుక్తంగా క్యాంపు నిర్వహించింది. ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు గుర్తించిన కేసులకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 700 కిలోమీటర్ల దూరాన ఉన్న పుదుచ్చేరిలోనే విచారణలు జరిగేవని క్యాంప్ నిర్వహణాధికారి, పుదుచ్చేరి సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆకాంక్ష యాదవ్ తెలిపారు.

సర్కార్ గుర్తించింది..

ఫలితంగా ఫిర్యాదుదారులు.. బాధితుల వ్యయ ప్రయాసలను ప్రభుత్వం గుర్తించిందని ఆమె పేర్కొన్నారు. రీజియన్ల వారీగా క్యాంపులు నిర్వహించి కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.

కేసులను పరిష్కరించాం..

కారేకాల మాహే రీజన్లలోనూ క్యాంపులు నిర్వహించి చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను విచారించి పరిష్కరించామన్నారు. క్యాంపులో భాగంగా ఏసీబీ ఉన్నతాధికారులతో కలిసి యానాంలో కేసులను విచారించారు.

ఇవీ చూడండి : విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఘనతే ఆజాద్​కే దక్కుతుంది: సీఎం జగన్

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత యానాంలో విజిలెన్స్ సహా అవినీతి నిరోధక శాఖ సంయుక్తంగా క్యాంపు నిర్వహించింది. ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు గుర్తించిన కేసులకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 700 కిలోమీటర్ల దూరాన ఉన్న పుదుచ్చేరిలోనే విచారణలు జరిగేవని క్యాంప్ నిర్వహణాధికారి, పుదుచ్చేరి సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆకాంక్ష యాదవ్ తెలిపారు.

సర్కార్ గుర్తించింది..

ఫలితంగా ఫిర్యాదుదారులు.. బాధితుల వ్యయ ప్రయాసలను ప్రభుత్వం గుర్తించిందని ఆమె పేర్కొన్నారు. రీజియన్ల వారీగా క్యాంపులు నిర్వహించి కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.

కేసులను పరిష్కరించాం..

కారేకాల మాహే రీజన్లలోనూ క్యాంపులు నిర్వహించి చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను విచారించి పరిష్కరించామన్నారు. క్యాంపులో భాగంగా ఏసీబీ ఉన్నతాధికారులతో కలిసి యానాంలో కేసులను విచారించారు.

ఇవీ చూడండి : విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఘనతే ఆజాద్​కే దక్కుతుంది: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.