తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత యానాంలో విజిలెన్స్ సహా అవినీతి నిరోధక శాఖ సంయుక్తంగా క్యాంపు నిర్వహించింది. ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు గుర్తించిన కేసులకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 700 కిలోమీటర్ల దూరాన ఉన్న పుదుచ్చేరిలోనే విచారణలు జరిగేవని క్యాంప్ నిర్వహణాధికారి, పుదుచ్చేరి సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆకాంక్ష యాదవ్ తెలిపారు.
సర్కార్ గుర్తించింది..
ఫలితంగా ఫిర్యాదుదారులు.. బాధితుల వ్యయ ప్రయాసలను ప్రభుత్వం గుర్తించిందని ఆమె పేర్కొన్నారు. రీజియన్ల వారీగా క్యాంపులు నిర్వహించి కేసుల పరిష్కారానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు.
కేసులను పరిష్కరించాం..
కారేకాల మాహే రీజన్లలోనూ క్యాంపులు నిర్వహించి చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను విచారించి పరిష్కరించామన్నారు. క్యాంపులో భాగంగా ఏసీబీ ఉన్నతాధికారులతో కలిసి యానాంలో కేసులను విచారించారు.
ఇవీ చూడండి : విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఘనతే ఆజాద్కే దక్కుతుంది: సీఎం జగన్