ETV Bharat / state

కొత్త జిల్లాలపై కసరత్తు ముమ్మరం

author img

By

Published : Nov 2, 2020, 9:44 AM IST

కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు ముమ్మరమైంది.. పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ఈ నెల 7 నాటికి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కలెక్టరేట్‌కు ఉత్తర్వులు వచ్చాయి. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ఆస్తులు, ఉద్యోగులు, ఇతర అన్ని అంశాలను క్రోడీకరించి వివరాలు సమర్పించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా పార్లమెంట్‌ నియోజకవర్గాల సరిహద్దులు, భౌగోళిక విస్తీర్ణం వివరాలు సేకరిస్తున్నారు.

formation of new district
కొత్త జిల్లాలపై కసరత్తు ముమ్మరం

తూర్పుగోదావరి‌ జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గాలుండగా.... ఇవి మూడు జిల్లాలుగా ఆవిర్భవించనున్నాయి. జిల్లాలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం అరకు పార్లమెంట్‌ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో రంపచోడవరం వేరే జిల్లా పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వీటి సమగ్ర సమచారాన్ని నివేదిక రూపంలో ఇవ్వాలని కొత్త జిల్లాల ఏర్పాటుపై నియమించిన జిల్లాస్థాయి కమిటీకి కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. ఈ కమిటీలో జేసీ(రెవెన్యూ), ఎస్పీ, సీపీవో, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, డీఈవో, డీఎంహెచ్‌వో తదితరులు ఉన్నారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు.

విద్యాశాఖకు సంబంధించిన సమాచారాన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సిద్ధం చేస్తున్నామని డీఈవో అబ్రహం తెలిపారు. నియోజకవర్గాల వారీగా పాఠశాల, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సొంత భవనాలు, ఖాళీగా ఉన్న భవనాల వివరాలను సేకరించడానికి అన్ని శాఖల పరిధిలో కసరత్తు చేస్తున్నారు.

కొత్త కలెక్టరేట్లు ఇక్కడేనా..?

పార్లమెంట్‌ నియోజకవర్గం జిల్లా కేంద్రం కానున్న నేపథ్యంలో కలెక్టరేట్ల ఏర్పాటుపైనా దృష్టిసారించారు. కాకినాడ పార్లమెంట్‌కు ప్రస్తుతం కలెక్టరేట్‌ ఉంది. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రంలో సబ్‌ కలెక్టరేట్‌ను కలెక్టరేట్‌గా చేస్తారని.. ధవళేశ్వరం జలవనరులశాఖ అతిథి గృహం వద్ద కొత్త భవనం నిర్మిస్తారని ప్రచారం సాగుతోంది. అమలాపురంలో ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టరేట్‌ చేసే అవకాశం ఉంది. లేకపోతే కొత్త భవనం నిర్మాణం చేపడతారు. ఈ దిశగా కూడా కొత్త భవనాలు అవసరమైన చోట స్థల సేకరణపైనా దృష్టిసారించారు.

వీటి లెక్కలు తేలాలి...

ప్రస్తుతం జిల్లాలో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ ఉన్నాయి. ఇవి వేరే జిల్లాలకు వెళ్లే అవకాశం ఉంది. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో అక్కడి పరిస్థితి బట్టి మైదాన ప్రాంత ఐటీడీఏలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అటవీ ప్రాంతం కూడా వీటిలో చాలా తక్కువగా ఉండటంతో అటవీశాఖ కార్యాలయాలు కూడా తరలిపోతాయని భావిస్తున్నారు. ఈ దిశగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

జిల్లా పునర్విభజనకు జనాభా లెక్కలు ప్రతిబంధకంగా మారాయి. వాస్తవంగా 2020 సంవత్సరంలో జనాభా లెక్కల గణన ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. 2021 సంవత్సరంలో దీన్ని చేపడతారని అధికారులు చెబుతున్నారు. జనాభా, సరిహద్దులు, భౌగోళిక విస్తీర్ణం తదితర అంశాలు జనాభా లెక్కల్లో పరిగణలోకి తీసుకుంటారు. దీనిపై కూడా కసరత్తు చేస్తున్నారు.

జిల్లాలో రెవెన్యూ డివిజన్లు, పోలీసు సబ్‌డివిజన్లు సమానంగా లేవు. జిల్లాలో ఏడు రెవెన్యూ డివిజన్లు ఉండగా, జిల్లా ఎస్పీ పరిధిలో ఆరు పోలీసు సబ్‌డివిజన్లు ఉన్నాయి. రాజమహేంద్రవరం అర్బన్‌ పోలీసు జిల్లా పరిధిలో నాలుగు జోన్లున్నాయి. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా రెవెన్యూ, పోలీసు సబ్‌డివిజన్లను సమానంగా ఏర్పాటు చేయడానికి కసరత్తు మొదలుపెట్టారు. జిల్లా ఎస్పీ పరిధిలోని రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్‌డివిజన్లు కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం జిల్లాల పరిధిలోకి కాకుండా వేరే జిల్లా పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది. వీటన్నింటిని సర్దుబాటు చేసే పనిలో పడ్డారు. దీంతో డివిజన్ల మార్పు అనివార్యం కానుంది.

కలెక్టరేట్‌లో ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైతే వీటిని కుదించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఉద్యోగుల వివరాలు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా తయారు చేయాలని జిల్లా ట్రెజరీ శాఖను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ వివరాలను ఆ శాఖ సేకరించే పనిలో పడింది.

నివేదికలు కోరాం..

కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయా శాఖల నుంచి నివేదికలు కోరాం. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా అన్ని వివరాలను నివేదించాలని సూచించాం. ప్రస్తుతం ఉన్న భవనాలు, ఆస్తులు, సరిహద్దులు, భౌగోళిక స్వరూపం, జనాభా, ఉద్యోగులు, వనరులు ఇలా అన్ని అంశాలతో కూడిన నివేదిక సిద్ధం చేస్తున్నాం. - సీహెచ్‌.సత్తిబాబు, జిల్లా రెవెన్యూ అధికారి

ఇదీ చదవండి: అవస్థలు కోకొల్లలు.. అభివృద్ధిపై ఆశలు

తూర్పుగోదావరి‌ జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్‌ నియోజకవర్గాలుండగా.... ఇవి మూడు జిల్లాలుగా ఆవిర్భవించనున్నాయి. జిల్లాలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం అరకు పార్లమెంట్‌ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో రంపచోడవరం వేరే జిల్లా పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వీటి సమగ్ర సమచారాన్ని నివేదిక రూపంలో ఇవ్వాలని కొత్త జిల్లాల ఏర్పాటుపై నియమించిన జిల్లాస్థాయి కమిటీకి కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. ఈ కమిటీలో జేసీ(రెవెన్యూ), ఎస్పీ, సీపీవో, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, డీఈవో, డీఎంహెచ్‌వో తదితరులు ఉన్నారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు.

విద్యాశాఖకు సంబంధించిన సమాచారాన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సిద్ధం చేస్తున్నామని డీఈవో అబ్రహం తెలిపారు. నియోజకవర్గాల వారీగా పాఠశాల, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సొంత భవనాలు, ఖాళీగా ఉన్న భవనాల వివరాలను సేకరించడానికి అన్ని శాఖల పరిధిలో కసరత్తు చేస్తున్నారు.

కొత్త కలెక్టరేట్లు ఇక్కడేనా..?

పార్లమెంట్‌ నియోజకవర్గం జిల్లా కేంద్రం కానున్న నేపథ్యంలో కలెక్టరేట్ల ఏర్పాటుపైనా దృష్టిసారించారు. కాకినాడ పార్లమెంట్‌కు ప్రస్తుతం కలెక్టరేట్‌ ఉంది. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రంలో సబ్‌ కలెక్టరేట్‌ను కలెక్టరేట్‌గా చేస్తారని.. ధవళేశ్వరం జలవనరులశాఖ అతిథి గృహం వద్ద కొత్త భవనం నిర్మిస్తారని ప్రచారం సాగుతోంది. అమలాపురంలో ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టరేట్‌ చేసే అవకాశం ఉంది. లేకపోతే కొత్త భవనం నిర్మాణం చేపడతారు. ఈ దిశగా కూడా కొత్త భవనాలు అవసరమైన చోట స్థల సేకరణపైనా దృష్టిసారించారు.

వీటి లెక్కలు తేలాలి...

ప్రస్తుతం జిల్లాలో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ ఉన్నాయి. ఇవి వేరే జిల్లాలకు వెళ్లే అవకాశం ఉంది. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో అక్కడి పరిస్థితి బట్టి మైదాన ప్రాంత ఐటీడీఏలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అటవీ ప్రాంతం కూడా వీటిలో చాలా తక్కువగా ఉండటంతో అటవీశాఖ కార్యాలయాలు కూడా తరలిపోతాయని భావిస్తున్నారు. ఈ దిశగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

జిల్లా పునర్విభజనకు జనాభా లెక్కలు ప్రతిబంధకంగా మారాయి. వాస్తవంగా 2020 సంవత్సరంలో జనాభా లెక్కల గణన ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. 2021 సంవత్సరంలో దీన్ని చేపడతారని అధికారులు చెబుతున్నారు. జనాభా, సరిహద్దులు, భౌగోళిక విస్తీర్ణం తదితర అంశాలు జనాభా లెక్కల్లో పరిగణలోకి తీసుకుంటారు. దీనిపై కూడా కసరత్తు చేస్తున్నారు.

జిల్లాలో రెవెన్యూ డివిజన్లు, పోలీసు సబ్‌డివిజన్లు సమానంగా లేవు. జిల్లాలో ఏడు రెవెన్యూ డివిజన్లు ఉండగా, జిల్లా ఎస్పీ పరిధిలో ఆరు పోలీసు సబ్‌డివిజన్లు ఉన్నాయి. రాజమహేంద్రవరం అర్బన్‌ పోలీసు జిల్లా పరిధిలో నాలుగు జోన్లున్నాయి. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా రెవెన్యూ, పోలీసు సబ్‌డివిజన్లను సమానంగా ఏర్పాటు చేయడానికి కసరత్తు మొదలుపెట్టారు. జిల్లా ఎస్పీ పరిధిలోని రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్‌డివిజన్లు కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం జిల్లాల పరిధిలోకి కాకుండా వేరే జిల్లా పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది. వీటన్నింటిని సర్దుబాటు చేసే పనిలో పడ్డారు. దీంతో డివిజన్ల మార్పు అనివార్యం కానుంది.

కలెక్టరేట్‌లో ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటైతే వీటిని కుదించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఉద్యోగుల వివరాలు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా తయారు చేయాలని జిల్లా ట్రెజరీ శాఖను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ వివరాలను ఆ శాఖ సేకరించే పనిలో పడింది.

నివేదికలు కోరాం..

కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆయా శాఖల నుంచి నివేదికలు కోరాం. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా అన్ని వివరాలను నివేదించాలని సూచించాం. ప్రస్తుతం ఉన్న భవనాలు, ఆస్తులు, సరిహద్దులు, భౌగోళిక స్వరూపం, జనాభా, ఉద్యోగులు, వనరులు ఇలా అన్ని అంశాలతో కూడిన నివేదిక సిద్ధం చేస్తున్నాం. - సీహెచ్‌.సత్తిబాబు, జిల్లా రెవెన్యూ అధికారి

ఇదీ చదవండి: అవస్థలు కోకొల్లలు.. అభివృద్ధిపై ఆశలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.