ETV Bharat / state

పింఛను 'రద్దుల ప్రభుత్వం' మాకొద్దని తెదేపా శ్రేణుల నిరసన - తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం వ్యాఖ్యలు

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎంపీపీ కార్యాలయం వద్ద తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. రద్దు చేసిన పింఛన్లు, తెల్ల రేషన్ కార్డులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పడాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

tdp protested against ycp government
పి.గన్నవరంలో తెదేపా నాయకులు నిరసన
author img

By

Published : Feb 6, 2020, 7:39 PM IST

పి.గన్నవరంలో తెదేపా నాయకుల నిరసన

రద్దు చేసిన పింఛన్లు, తెల్ల రేషన్ కార్డులు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎంపీపీ కార్యాలయం వద్ద తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. అర్హులకు పింఛన్లు, తెల్ల రేషన్​ కార్డులు రద్దు చేయడం దారుణమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం ఆవేదన వ్యక్తం చేశారు. రద్దు చేసిన వాటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్​ చేస్తూ.. రద్దుల ప్రభుత్వం మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో చక్రధరరావుకు అందించారు.

పి.గన్నవరంలో తెదేపా నాయకుల నిరసన

రద్దు చేసిన పింఛన్లు, తెల్ల రేషన్ కార్డులు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎంపీపీ కార్యాలయం వద్ద తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. అర్హులకు పింఛన్లు, తెల్ల రేషన్​ కార్డులు రద్దు చేయడం దారుణమని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం ఆవేదన వ్యక్తం చేశారు. రద్దు చేసిన వాటిని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్​ చేస్తూ.. రద్దుల ప్రభుత్వం మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో చక్రధరరావుకు అందించారు.

ఇవీ చూడండి:

'ఉప్పూడిలో గ్యాస్ లీకేజీ సమస్యను పరిష్కరించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.