అన్నవరం దేవస్థానంలో వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇక నుంచి మరింత కఠినతరం కానుంది. వివాహం చేసుకున్న వధూవరులు తగిన ధ్రువపత్రాలు అందించి రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌలభ్యం ఇంతకు మునుపు ఉండేది. అలా వివాహం చేసుకున్న వారికి గతంలో అధికారులు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేవారు. దీనివల్ల న్యాయ పరమైన ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల కొన్నేళ్ల క్రితం ఈ విధానాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం కొండపై వివాహం చేసుకునే వారు ఫోటోలు, శుభలేఖ, అఫిడవిట్, వయసు నిర్ధరణ పత్రం, వదూవరులు, వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు నివాస, ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, రెండో వివాహం అయితే విడాకుల పత్రం, దంపతుల్లో ఎవరైనా ఒకరు మరణిస్తే తర్వాత రెండో వివాహం చేసుకుంటే... మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా ధ్రువపత్రాల జెరాక్స్ పై గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి... వివాహానికి మూడు రోజుల ముందే దేవస్థానంలోని వివాహ రిజిస్ట్రేషన్ కేంద్రంలో ఇవ్వాలని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి...