తూర్పు గోదావరి జిల్లా వెంకటనగరంలో మాజీ సర్పంచి ఉప్పులూరి వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో.. గ్రామదేవత గొంతేలమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఐదేళ్లకు ఒకసారి ఈ గొంతెలమ్మ జాతర మూడు రోజుల పాటు జరుగుతుంది. ఇవాళ చివరి రోజు సందర్భంగా.. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు.. రాత్రి వేళ వెంకటనగరంలో అన్నదానం ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఇదీ చదవండి: