ETV Bharat / state

ఆందోళనలో గోదావరి డెల్టా రైతులు.. - తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి డెల్టా వార్తలు

గోదావరి డెల్టాలో రబీలో వరి సాగుకు... మార్చి 31 వరకు నీటి సరఫరా గడువు విధించడంతో రైతుల్లో కలవరం మొదలైంది. ఈ ఏడాది రికార్డు స్థాయి వరదలు, కుండపోత వర్షాలు, తుపాన్లు ఇలా వరుస ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రబీలోనైనా కాస్త ఆదాయం సమకూర్చుకుందామని గంపెడు ఆశతో ఉన్నారు. అయితే పోలవరం కాఫర్ డ్యామ్ మూసి వేసేందుకు నీటి సరఫరా నిలిపివేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం వారి ఆశలపై నీళ్లు చల్లింది. మండు వేసవిలో నీటి ఎద్దడి తలెత్తితే పంటను కాపాడుకోవడం ఎలా అన్న ఆందోళన నెలకొంది.

Godavari delta
Godavari delta
author img

By

Published : Dec 10, 2020, 9:19 AM IST

గోదావరి డెల్టా.. అతలాకుతలం

ఈ ఖరీఫ్ సీజన్‌లో గోదావరి డెల్టా.. అతలాకుతలమైంది. ఆగస్టులో వచ్చిన వరదల వల్ల ఉభయ గోదావరి జిల్లాలో పంటలు నీట మునిగాయి. ఆ తర్వాత ఎడతెరిపిలేని వర్షాలు వరి పంటను కోలుకోలేని దెబ్బ తీశాయి. రెండు జిల్లాల పరిధిలో డెల్టాలో కోతల సమయంలో వచ్చిన నివర్ తుపాను రైతులకు అపార నష్టం మిగిల్చింది. ఖరీఫ్ పెట్టుబడులు నీటి పాలవ్వడంతో రబీపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో గతనెల 24న రాజమహేంద్రవరంలో ఉభయ గోదావరి జిల్లాల సాగు నీటి సలహా మండలి సమావేశంలో... మార్చి 31 నాటికి డెల్టా కాల్వలు కట్టేయాలని నిర్ణయం తీసుకున్నారు. పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల.. రబీలో వరి సాగు ఎలా అన్న సందేహం డెల్టా రైతుల్లో నెలకొంది.

నివర్ తుపాను దెబ్బకు నేల వాలిన పంట కోతలు ఇంకా పూర్తి కాలేదు. కొన్ని ప్రాంతాల్లో కోతలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రబీ నాట్లు పూర్తయ్యేందుకు ఈ నెలాఖరు వరకు సమయం పట్టే అవకాశంఉంది. ప్రభుత్వం 120 రోజుల్లో.. రబీలో వరి పంట పూర్తి చేయాలని గడువు విధించింది. డెల్టాలో రబీ కోతలు ఏప్రిల్ నెలాఖరు వరకు జరుగుతాయి.మార్చి చివర్లో కాల్వలు కట్టేస్తే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తి పంటలు నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సహజంగానే గోదావరి డెల్టాలో.. ఏటా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తుతుంది. ఈ సమయంలో ఒడిశాలోని బలిమెల నుంచి సీలేరు ద్వారా గోదావరి డెల్టాకు నీరు తరలిస్తారు. ఈ ప్రక్రియ పంట పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. మరి ఈసారి కాఫర్ డ్యాం మూసేసి, మార్చి 31 నాటికి కాల్వలు కట్టేస్తే పరిస్థితి ఏంటని రైతుల్లో ఆందోళన నెలకొంది.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి

గోదావరి డెల్టా.. అతలాకుతలం

ఈ ఖరీఫ్ సీజన్‌లో గోదావరి డెల్టా.. అతలాకుతలమైంది. ఆగస్టులో వచ్చిన వరదల వల్ల ఉభయ గోదావరి జిల్లాలో పంటలు నీట మునిగాయి. ఆ తర్వాత ఎడతెరిపిలేని వర్షాలు వరి పంటను కోలుకోలేని దెబ్బ తీశాయి. రెండు జిల్లాల పరిధిలో డెల్టాలో కోతల సమయంలో వచ్చిన నివర్ తుపాను రైతులకు అపార నష్టం మిగిల్చింది. ఖరీఫ్ పెట్టుబడులు నీటి పాలవ్వడంతో రబీపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో గతనెల 24న రాజమహేంద్రవరంలో ఉభయ గోదావరి జిల్లాల సాగు నీటి సలహా మండలి సమావేశంలో... మార్చి 31 నాటికి డెల్టా కాల్వలు కట్టేయాలని నిర్ణయం తీసుకున్నారు. పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల.. రబీలో వరి సాగు ఎలా అన్న సందేహం డెల్టా రైతుల్లో నెలకొంది.

నివర్ తుపాను దెబ్బకు నేల వాలిన పంట కోతలు ఇంకా పూర్తి కాలేదు. కొన్ని ప్రాంతాల్లో కోతలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రబీ నాట్లు పూర్తయ్యేందుకు ఈ నెలాఖరు వరకు సమయం పట్టే అవకాశంఉంది. ప్రభుత్వం 120 రోజుల్లో.. రబీలో వరి పంట పూర్తి చేయాలని గడువు విధించింది. డెల్టాలో రబీ కోతలు ఏప్రిల్ నెలాఖరు వరకు జరుగుతాయి.మార్చి చివర్లో కాల్వలు కట్టేస్తే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తి పంటలు నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సహజంగానే గోదావరి డెల్టాలో.. ఏటా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తుతుంది. ఈ సమయంలో ఒడిశాలోని బలిమెల నుంచి సీలేరు ద్వారా గోదావరి డెల్టాకు నీరు తరలిస్తారు. ఈ ప్రక్రియ పంట పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. మరి ఈసారి కాఫర్ డ్యాం మూసేసి, మార్చి 31 నాటికి కాల్వలు కట్టేస్తే పరిస్థితి ఏంటని రైతుల్లో ఆందోళన నెలకొంది.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.