తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో... వరద ముంపునకు గురైన ప్రాంతాలను మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు దాట్ల బుజ్జిబాబు, వనమాడి కొండబాబు పరిశీలించారు. ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాలలో.. వరద ముంపునకు గురైన గ్రామాలలో పడవలపై తిరుగుతూ బాధితులను పరామర్శించారు. ఏ విపత్కర పరిస్థితులు వచ్చినా ప్రజలను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వారు విమర్శించారు.
ఇదీ చదవండి: