ETV Bharat / state

ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ఎంఎల్ ధర్నా

author img

By

Published : Aug 31, 2020, 5:29 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై సీపీఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కరోనా కారణంగా ఇబ్బందులకు గురవుతున్న పేదలను, రైతులను అందుకోవాలని సీపీఎంఎల్ నాయకులు డిమాండ్ చేశారు.

cpiml darna in east godavari
ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ఎంఎల్ ధర్నా

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై సీపీఐ ఎంఎల్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్​లో వ్యవసాయ కూలీలు, కార్మికులు ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారని… ప్రతి పేద కుటుంబానికి రూ.10వేల ఆర్థికసాయం, 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, ఆరు నెలల పాటు కరవు భత్యం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కౌలు రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇచ్చి… వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరాారు. పండించిన పంటకు రైైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మహిళలకు డ్వాక్రా రుణాలను రద్దు చేసి స్వయం సహాయక రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి వ్యవసాయ కూలీకి జాతీయ ఉపాధి హామీ పథకంలో దేశవ్యాప్తంగా కనీస వేతనం రూ.500 ఇచ్చి 200 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న రెవెన్యూ, కొండ, భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రభుత్వాధికారులు… పంచాయతీ స్థాయిలో.. బ్లీచింగ్​తో వాటర్ ట్యాంక్​ను పరిశుభ్రం చేయాలని డిమాండ్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై సీపీఐ ఎంఎల్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్​లో వ్యవసాయ కూలీలు, కార్మికులు ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారని… ప్రతి పేద కుటుంబానికి రూ.10వేల ఆర్థికసాయం, 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, ఆరు నెలల పాటు కరవు భత్యం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కౌలు రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇచ్చి… వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కోరాారు. పండించిన పంటకు రైైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మహిళలకు డ్వాక్రా రుణాలను రద్దు చేసి స్వయం సహాయక రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి వ్యవసాయ కూలీకి జాతీయ ఉపాధి హామీ పథకంలో దేశవ్యాప్తంగా కనీస వేతనం రూ.500 ఇచ్చి 200 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న రెవెన్యూ, కొండ, భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రభుత్వాధికారులు… పంచాయతీ స్థాయిలో.. బ్లీచింగ్​తో వాటర్ ట్యాంక్​ను పరిశుభ్రం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

సైబర్ నేరాలపై అవగాహనే ఈ-రక్షాబంధన్ లక్ష్యం: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.