ETV Bharat / state

కంటైన్మెంట్​ ప్రాంతాల్లో మరోసారి సంపూర్ణ లాక్​డౌన్

author img

By

Published : Jun 24, 2020, 4:33 PM IST

Updated : Jun 24, 2020, 5:46 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం కంటైన్మెంట్​ ప్రాంతాల్లో మళ్లీ సంపూర్ణ లాక్​డౌన్ ప్రకటించింది.

a-complete-lockdown-once-again-in-the-east-godavari-district
తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి సంపూర్ణ లాక్​డౌన్

తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా అధికారులు జిల్లాలోని కంటైన్మెంట్​ ప్రాంతాల్లో మళ్లీ లాక్​డౌన్ విధించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం కనకాలపేటలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ గ్రామాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించి.. 14 రోజులపాటు అన్ని రకాల వ్యాపారాలను మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు. తాళ్లరేవు మండలం వెంకటాయపాలెం, కాట్రేనికోన మండలం దొంతుకుర్రులో గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.

జాతీయ రహదారి 216 యానాం-తాళ్లరేవుల మీదుగా ఉండటంతో అధికారులు.. అంతర్రాష్ట్ర సరిహద్దులు ఏర్పాటు చేసి ఆ మార్గంలో ప్రయాణించే వాహనాలను పరిశీలిస్తున్నారు. మాస్కులు ధరించకపోయినా, ద్విచక్రవాహనంపై ఒకరికి మించి ప్రయాణం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా అధికారులు జిల్లాలోని కంటైన్మెంట్​ ప్రాంతాల్లో మళ్లీ లాక్​డౌన్ విధించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం కనకాలపేటలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ గ్రామాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించి.. 14 రోజులపాటు అన్ని రకాల వ్యాపారాలను మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు. తాళ్లరేవు మండలం వెంకటాయపాలెం, కాట్రేనికోన మండలం దొంతుకుర్రులో గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.

జాతీయ రహదారి 216 యానాం-తాళ్లరేవుల మీదుగా ఉండటంతో అధికారులు.. అంతర్రాష్ట్ర సరిహద్దులు ఏర్పాటు చేసి ఆ మార్గంలో ప్రయాణించే వాహనాలను పరిశీలిస్తున్నారు. మాస్కులు ధరించకపోయినా, ద్విచక్రవాహనంపై ఒకరికి మించి ప్రయాణం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

ఇదీచదవండి.

అది 'జగన్ రెడ్డి ఇళ్ల స్థలాల అమ్మకం పథకం': నారా లోకేశ్

Last Updated : Jun 24, 2020, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.