ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో 240 కిలోల గంజాయి పట్టివేత

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిపై 240 కిలోల గంజాయి పట్టుబడింది. నలుగురు యువకులు విశాఖ మన్యం నుంచి హైదరాబాద్​కు గంజాయి తరలిస్తుండగా పోలీసులు తనిఖీ చేపట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : May 19, 2021, 8:04 PM IST

గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిపై రామవరం వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 240 కిలోల గంజాయి పట్టుబడింది. హైదరాబాద్​కు చెందిన నలుగురు యువకులు విశాఖ మన్యం నుంచి హైదరాబాద్​కు ఇన్నోవా కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారని జగ్గంపేట సీఐ సురేశ్ బాబు తెలిపారు. విశాఖ మన్యంలో కిలో గంజాయి రెండు వేల రూపాయల చొప్పున కోనుగోలు చేసి..హైదరాబాద్​లో ఐదు వేల రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నారని వెల్లడించారు. నలుగురు యువకుల నుంచి 4 సెల్​ఫోన్లు, 9,700 నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. యువత ఇటువంటి చర్యలకు పాల్పడి తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సీఐ సురేశ్ బాబు అన్నారు. తనిఖీల్లో జగ్గంపేట ఎమ్మార్వో, ఇద్దరు వీఆర్వోలు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిపై రామవరం వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 240 కిలోల గంజాయి పట్టుబడింది. హైదరాబాద్​కు చెందిన నలుగురు యువకులు విశాఖ మన్యం నుంచి హైదరాబాద్​కు ఇన్నోవా కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారని జగ్గంపేట సీఐ సురేశ్ బాబు తెలిపారు. విశాఖ మన్యంలో కిలో గంజాయి రెండు వేల రూపాయల చొప్పున కోనుగోలు చేసి..హైదరాబాద్​లో ఐదు వేల రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నారని వెల్లడించారు. నలుగురు యువకుల నుంచి 4 సెల్​ఫోన్లు, 9,700 నగదు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. యువత ఇటువంటి చర్యలకు పాల్పడి తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సీఐ సురేశ్ బాబు అన్నారు. తనిఖీల్లో జగ్గంపేట ఎమ్మార్వో, ఇద్దరు వీఆర్వోలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 23,160 కరోనా కేసులు, 106 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.