ETV Bharat / state

డీఐజీ మానవత్వం.. కానిస్టేబుల్ భార్యకు సకాలంలో వైద్యసేవలు!

author img

By

Published : May 31, 2021, 9:49 PM IST

Updated : Jun 1, 2021, 1:25 PM IST

కరోనాతో బాధపడుతున్న ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు డీఐజీ (DIG) క్రాంతి రాణా టాటా. డీఐజీ (DIG) చొరవతో వైద్యుల సకాలంలో చికిత్స అందించడంతో బాధితురాలు మగబిడ్డకు జన్మనిచ్చింది.

women delivered a baby
మగబిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

కడప జిల్లా రైల్వేకోడూరు టాస్క్​ ఫోర్స్ సబ్ కంట్రోల్ కానిస్టేబుల్ పి.సుజయ్ కుమార్ భార్య సంధ్యకు ఏప్రిల్ 25న కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. అప్పటికే ఆమె 8 నెలల గర్భవతి కావడంతో చికిత్స నిమిత్తం కడప రిమ్స్ లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో... ఈ విషయాన్ని డీఐజీ క్రాంతి రాణా టాటా దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన డీఐజీ... బాధితురాలిని హుటాహుటిన తిరుపతిలోని అంకుర ఆస్పత్రికి తరలించారు.

వైద్యుల చొరవతో బాధితురాలు మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను 25 రోజుల పాటు వైద్యుల సంరక్షణలో ఉంచి, సోమవారం డిశ్ఛార్జ్ చేశారు. ఇంట్లో కూడా బాధితురాలికి ఆక్సిజన్ అవసరం అని వైద్యులు చెప్పడంతో డీఐజీ క్రాంతి రాణా టాటా ఆక్సిజన్ కాన్సంట్రేటర్​ను ఏర్పాటు చేశారు.

కడప జిల్లా రైల్వేకోడూరు టాస్క్​ ఫోర్స్ సబ్ కంట్రోల్ కానిస్టేబుల్ పి.సుజయ్ కుమార్ భార్య సంధ్యకు ఏప్రిల్ 25న కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. అప్పటికే ఆమె 8 నెలల గర్భవతి కావడంతో చికిత్స నిమిత్తం కడప రిమ్స్ లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో... ఈ విషయాన్ని డీఐజీ క్రాంతి రాణా టాటా దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన డీఐజీ... బాధితురాలిని హుటాహుటిన తిరుపతిలోని అంకుర ఆస్పత్రికి తరలించారు.

వైద్యుల చొరవతో బాధితురాలు మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను 25 రోజుల పాటు వైద్యుల సంరక్షణలో ఉంచి, సోమవారం డిశ్ఛార్జ్ చేశారు. ఇంట్లో కూడా బాధితురాలికి ఆక్సిజన్ అవసరం అని వైద్యులు చెప్పడంతో డీఐజీ క్రాంతి రాణా టాటా ఆక్సిజన్ కాన్సంట్రేటర్​ను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

ఆనందయ్య మందుతో కొవిడ్‌ తగ్గిందనేందుకు ఆధారం లభించలేదు: ఆయుష్‌ కమిషనర్‌

Last Updated : Jun 1, 2021, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.