ETV Bharat / state

తితిదే ఉద్యోగిని హత్య.. ఆర్థిక లావాదేవీలే కారణమా?

author img

By

Published : Jun 2, 2021, 10:40 PM IST

చిత్తూరు జిల్లాలో చిగురుపల్లి సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని కాణిపాకం పోలీసులు గుర్తించారు. తితిదేలో స్వీపరుగా పనిచేస్తోన్న ఆమె.. గత నెల 31వ తేదీన అదృశ్యమైంది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

murder
murder

చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిగరపల్లి సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని కాణిపాకం పోలీసులు గుర్తించారు. మృతురాలు తితిదే ఉద్యోగి సరోజమ్మ(59)గా పోలీసులు తెలిపారు. స్వీపరుగా తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్న సరోజమ్మ.. గత నెల 31వ తేదీన అదృశ్యమైంది. ఆమె కనిపించటం లేదంటూ కుటుంబసభ్యులు.. తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కింద నమోదు చేసిన పోలీసులు..దర్యాప్తు ప్రారంభించారు. సరోజమ్మ మృతదేహాన్ని గుర్తించిన కాణిపాకం పోలీసులు తిరుమల పోలీసులకు సమాచారం అందించారు. తితిదేలో పనిచేస్తున్న ఓ ఒప్పంద ఉద్యోగి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా తెలుస్తోంది. దర్యాప్తు చేసిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. సరోజమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిగరపల్లి సమీపంలో ఓ మహిళ మృతదేహాన్ని కాణిపాకం పోలీసులు గుర్తించారు. మృతురాలు తితిదే ఉద్యోగి సరోజమ్మ(59)గా పోలీసులు తెలిపారు. స్వీపరుగా తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్న సరోజమ్మ.. గత నెల 31వ తేదీన అదృశ్యమైంది. ఆమె కనిపించటం లేదంటూ కుటుంబసభ్యులు.. తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు కింద నమోదు చేసిన పోలీసులు..దర్యాప్తు ప్రారంభించారు. సరోజమ్మ మృతదేహాన్ని గుర్తించిన కాణిపాకం పోలీసులు తిరుమల పోలీసులకు సమాచారం అందించారు. తితిదేలో పనిచేస్తున్న ఓ ఒప్పంద ఉద్యోగి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా తెలుస్తోంది. దర్యాప్తు చేసిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. సరోజమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

ఇదీ చదవండి: SGB: కరోనాతో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఛైర్మన్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.