ETV Bharat / state

లాక్​డౌన్​పై అవగాహన కల్పిస్తూ... పోలీస్ వాహనాలతో ర్యాలీ - tirupahti police awareness rally on lock down

తిరుపతి ప్రజలకు లాక్​డౌన్​పై అవగాహన కల్పిస్తూ... పోలీసులు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ వాహనాలతో నగర వీధుల్లో తిరుగుతూ... లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించవద్దని సూచించారు.

lock down in tiurpathi
తిరుపతి పోలీస్ అవగాహన ర్యాలీ
author img

By

Published : Jul 22, 2020, 9:44 PM IST

అత్యవసరమైతే తప్ప తిరుపతి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని... పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ వాహనాలలో తిరుగుతూ తిరుపతి నగర వీధుల్లో లాక్​డౌన్​పై అవగాహన కల్పించారు. ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ.. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. స్వీయ నిర్బంధం పాటించాలని రెడ్ జోన్ ఏరియాలో ఉంటున్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. లాక్​డౌన్ ఉల్లంఘించి రహదారులపైకి వస్తున్న వారికి ప్రత్యేక డ్రైవ్​లు నిర్వహించి... లాక్​డౌన్ నిబంధనలు తెలియజేస్తున్నామన్నారు. కరోనా వైరస్​ను కట్టడి చేయటంలో ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.

అత్యవసరమైతే తప్ప తిరుపతి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని... పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ వాహనాలలో తిరుగుతూ తిరుపతి నగర వీధుల్లో లాక్​డౌన్​పై అవగాహన కల్పించారు. ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ.. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. స్వీయ నిర్బంధం పాటించాలని రెడ్ జోన్ ఏరియాలో ఉంటున్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. లాక్​డౌన్ ఉల్లంఘించి రహదారులపైకి వస్తున్న వారికి ప్రత్యేక డ్రైవ్​లు నిర్వహించి... లాక్​డౌన్ నిబంధనలు తెలియజేస్తున్నామన్నారు. కరోనా వైరస్​ను కట్టడి చేయటంలో ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.

ఇదీ చదవండి: తంబళ్లపల్లె మండలంలో మెుదటి కరోనా పాజిటివ్ కేసు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.