తిరుమల శ్రీవారి ఆలయంలో సహస్రకలశాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏటా జ్యేష్ఠమాసంలో ఆదివారం రోజు ఈ ప్రత్యేక సహస్రకలశాభిషేకాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఆగమం ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో ఒకరైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని 'కౌతుకమూర్తి' అని, శ్రీ 'మనవాళపెరుమాళ్' అని కూడా పిలుస్తారు. ఈయన భోగ శ్రీనివాసమూర్తి. శంఖు, చక్రధారియై, చతుర్భుజుడైన ఈ భోగమూర్తిని మూలవిరాట్నకు ప్రతిరూపంగా భావిస్తారు. ఒకటిన్నర అడుగుల ఎత్తున్న ఈ వెండి విగ్రహాన్ని 614వ సంవత్సరంలో పల్లవరాణి సామవై బహూకరించారు. స్వామివారి మూలమూర్తి పాదాల ముందు ఈ విగ్రహం ఉంటుంది. భోగశ్రీనివాసమూర్తికి ప్రతి రోజు ఉదయం ఆకాశగంగ తీర్థంతో అభిషేకం నిర్వహిస్తారు. బుధవారం ఉదయం బంగారువాకిలి ముందు సహస్రకలశాభిషేకం చేస్తారు. ప్రతి రోజు రాత్రి ఏకాంత సేవ (పవ్వళింపు సేవ) జరిగేది భోగశ్రీనివాసుడికే.
ఇదీ చదవండీ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు