ETV Bharat / state

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎస్​ఈసీ

author img

By

Published : Feb 4, 2021, 9:45 AM IST

ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం మహాద్వారం వద్ద తితిదే జేఈఓ బసంత్ కుమార్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందచేశారు.

SEC Nimmagadda Ramesh Kumar
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొన్న ఎస్​ఈసీ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై చిత్తూరు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు కమిషనర్ తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకొన్న ఆయనకు చిత్తూరు సంయుక్త కలెక్టర్ మార్కండేయులు స్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం చేరుకొన్నారు. ఆలయం మహాద్వారం వద్ద తితిదే జేఈఓ బసంత్ కుమార్ కమిషనర్​కు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందచేశారు. వేద పండితులు కమిషనర్​కు ఆశీర్వచనం పలికారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలపై చిత్తూరు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు కమిషనర్ తిరుపతి వచ్చారు. రేణిగుంట విమానాశ్రయం చేరుకొన్న ఆయనకు చిత్తూరు సంయుక్త కలెక్టర్ మార్కండేయులు స్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి నేరుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం చేరుకొన్నారు. ఆలయం మహాద్వారం వద్ద తితిదే జేఈఓ బసంత్ కుమార్ కమిషనర్​కు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందచేశారు. వేద పండితులు కమిషనర్​కు ఆశీర్వచనం పలికారు.

ఇదీ చదవండి:

రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను తప్పక వినియోగిస్తా: ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.