ETV Bharat / state

వరుణుడి కరుణ కోసం... ఐక్యమత పూజలు - special pooja

సకాలంలో వర్షాలు కురవాలని మతాలకతీతంగా చిత్తూరు జిల్లా తంబళ్లపెల్లెలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు లేక భూములు బీడులుగా మారుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

వర్షాలు కురవాలని మతాలకతీతంగా ప్రత్యేక పూజలు
author img

By

Published : Jun 23, 2019, 8:25 PM IST

రాష్ట్రమంతా నైరుతి రుతు పవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నా... చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాల్లో వర్షాల జాడ లేదు. దీంతో తంబళ్లపల్లె అక్కమ్మ చెరువులో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు వాన దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ముస్లిం మహిళలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హిందువులు కప్పలకు పూజలు నిర్వహించారు. ఇంతటి దారణమైన కరువు పరిస్థితులు ఎన్నడూ చూడలేందటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షాలు కురవాలని మతాలకతీతంగా ప్రత్యేక పూజలు

రాష్ట్రమంతా నైరుతి రుతు పవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నా... చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాల్లో వర్షాల జాడ లేదు. దీంతో తంబళ్లపల్లె అక్కమ్మ చెరువులో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు వాన దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ముస్లిం మహిళలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హిందువులు కప్పలకు పూజలు నిర్వహించారు. ఇంతటి దారణమైన కరువు పరిస్థితులు ఎన్నడూ చూడలేందటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి.. వరుణుడి రాక కోసం... కప్పలకు పెళ్లి

Intro:శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తూర్పుపూండ్ల గ్రామంలోని ఎస్ సి కాలానికి అతి దగ్గర్లో ఉన్న ఒక మైనింగ్ ఆ కాలనీ వాసులకు బయబ్రాంతులకు గురిచేస్తూ నిద్ర లేకుండా చేస్తున్నదని ఆ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మైనింగ్ జరుగుతున్నప్పటికీ ఎప్పుడు ఈవిధముగా బయపడలేదని గ్రామస్థులు చెబుతున్నారు.ఇంతకుముందు మైనింగ్ జరుపుతున్న వారు గడ్డపారలతో మాత్రమే తవ్వి మైనింగ్ చేసేవారని కానీ ఇప్పుడు లీజుకు తీసుకున్నవారు పెద్ద పెద్ద మిషనరీలతో మైనింగ్ చేస్తూ బాంబు బ్లాస్టలు కూడా చేస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. కాలానికి అతి దగ్గరలో ఉండడటం వలన బాంబు బ్లాస్టులకు ఇండ్లన్నీ ఆదిరిపోయి పగుళ్లు ఇచ్చి స్లాబులు కూడా పెచ్చులు పెచ్చులుగా ఊడి పడిపోతున్నవని ఇలా పడిపోతుంటే ఇండ్లలో ఉండాలన్న భయంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము నిత్యం కూలి పనులకు వెళ్ళేవాళ్ళమని పనులకు వెళ్ళినపుడు మాపిల్లలంతా ఇక్కడే ఆడుకుంటూ ఉంటారని వాళ్లకు ఈ బాంబు బ్లాస్టులనుంచి రక్షణ లేదని చెబుతున్నారు. ఈ బ్లాస్టుల వలన వచ్చే దుమ్ము ధూళి వలన నీరంతా కలుషితమై చర్మ రోగాలు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. రాత్రులు కూడా బాంబు బ్లాస్టలు చేస్తున్నారని ఆ సమయంలో ఆ రాళ్లు వచ్చి ఎక్కడపడతాయోనని భయం ఆ శబ్దాలు నిద్రకుడా పట్టకుండా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని ఎంతమంది అధికారులకు చెప్పిన మాకు న్యాయం జరగడం లేదని ఎలాగైనా ఈ మైనింగ్ ఆపి మా ప్రాణాలు కాపాడమని ప్రశాంతంగా జీవించే విధముగా చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Body:1


Conclusion:బైట్ 1: పొలమ్మ (గ్రామస్థురాలు) బైట్ 2: రాజ్యలక్ష్మి(గ్రామస్థురాలు) బైట్ 3:వాణి (గ్రామస్థురాలు) బైట్ 4: వెంకటేశ్వర్లు(గ్రామస్థుడు)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.