ETV Bharat / state

వివాహిత అనుమానాస్పద మృతి..భర్తపై ఫిర్యాదు

చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండల కేంద్రంలో వివాహిత అనుమానాస్పదంగా ఉరివేసుకొని మృతి చెందింది. తన కుమార్తె మృతికి భర్త, కుటుంబ సభ్యులే కారణమని మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

author img

By

Published : Oct 20, 2020, 11:47 PM IST

married-woman-suspected-death
వివాహిత అనుమానస్పద మరణం


చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండల కేంద్రంలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. పెద్దమండ్యంలోని ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందగా.. తమ కుమార్తె మృతికి భర్త, కుటుంబీకులే కారణమని మృతురాలి తండ్రి ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడు. కడప జిల్లా రాయచోటికి చెందిన పీరా కుమార్తె హసీనాను పెద్దమండ్యం మండల కేంద్రంలోని రెడ్డిపీరాకు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపారు. కుమార్తె మృతిపై పలు అనుమానాలున్నాయని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండల కేంద్రంలో వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. పెద్దమండ్యంలోని ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందగా.. తమ కుమార్తె మృతికి భర్త, కుటుంబీకులే కారణమని మృతురాలి తండ్రి ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించాడు. కడప జిల్లా రాయచోటికి చెందిన పీరా కుమార్తె హసీనాను పెద్దమండ్యం మండల కేంద్రంలోని రెడ్డిపీరాకు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపారు. కుమార్తె మృతిపై పలు అనుమానాలున్నాయని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి...

కళ్లెదుటే కుమారుడి మృతదేహం...దిక్కుతోచని స్థితిలో తల్లి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.