ETV Bharat / state

తుమ్మలవారిపల్లిలో భూ ప్రకంపనలు.. ఆందోళనలో ప్రజలు - చిత్తూరు జిల్లా వార్తలు

గత రెండు రోజులుగా చిత్తూరు జిల్లా తుమ్మవారిపల్లిలో భూప్రకంపనలు వస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి చుట్టుపక్కల ఎక్కువగా బోర్లు వేయడం వల్లే శబ్ధాలు వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు.

vతుమ్మలవారిపల్లిలో భూ ప్రకంపనలు
తుమ్మలవారిపల్లిలో భూ ప్రకంపనలు
author img

By

Published : Nov 23, 2021, 9:31 PM IST

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తుమ్మవారిపల్లిలో గత రెండు రోజులుగా భూ ప్రకంపనలు వస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకోవడంతో మండల స్థాయి అధికారులు గ్రామంలోకి వెళ్లి పరిశీలించారు. భూమి నుంచి శబ్దాలు వస్తుండటాన్ని గుర్తించారు. గ్రామం చుట్టు పక్కల ఎక్కవగా బోర్లు వేయడంతో శబ్దాలు వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.