ETV Bharat / state

తలపై జీలకర్ర బెల్లం- పెళ్లిదుస్తులతో పరీక్షకు నవవధువు! కట్టుదిట్టమైన భద్రత నడుమ గ్రూప్‌-2 మెయిన్స్‌ - APPSC GROUP2 MAINS

రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్​-2 పరీక్షలు- విశాఖలో పరీక్షకు ఆలస్యమైన యువతి కన్నీటి పర్యంతం

bride_appeared_for_group2_mains_exam_in_tirupati
bride_appeared_for_group2_mains_exam_in_tirupati (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2025, 3:38 PM IST

Updated : Feb 23, 2025, 5:34 PM IST

Bride Appeared for Group2 Mains Exam in Tirupati : ఏపీ వ్యాప్తంగా పటిష్టమైన భద్రత నడుమ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ముగిసాయి. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు మెటల్ డిటెక్టివ్ ద్వారా తనిఖీ చేసి అభ్యర్ధులను పరీక్షా కేంద్రాల్లోకి పంపారు. బ్లూటూత్, చరవాణి తదితరవాతన్నింటిని అభ్యర్ధులు పరీక్ష కేంద్రం బయటనే పెట్టేసి వెళ్లారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ దశలో చోటు చేసుకోకుండా జిరాక్స్ కేంద్రాలను మూసివేశారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్‌ తొలి పేపర్‌ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో పేపర్‌ . 92,250 మంది అభ్యర్థులు పరీక్షలకు హజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, పలుచోట్ల పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు హజరీలో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. పలువురు అభ్యర్ధులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో అధికారులు, పోలీసులు వారిని వెనక్కి పంపించివేయడం పలువుర్ని కలచివేసింది.

తిరుపతిలో జరుగుతున్న గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు ఓ నవవధువు హాజరైంది. చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో ఉదయం పెళ్లి ముహూర్తంలో తలపై జీలకర్ర బెల్లం పెట్టుకుని పరీక్షకు హజరైంది. పెళ్లి తంతంగం పూర్తికి ఇంకా సమయం ఉండటంతో తిరుపతిలోని శ్రీ పద్మావతి పీజీ, ిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రానికి చేరుకుని ఆ నవ వధువు పరీక్ష రాశారు.

వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రమైన కడపలో 13 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద మూడంచల భద్రతను ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. జిల్లా వ్యాప్తంగా 5825 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

విశాఖ జిల్లా ఇచ్చాపురం నుంచి రాజు అనే అభ్యర్థితో పాటు మరో వ్యక్తి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోకపోవడంతో పరీక్షకు అనుమతించలేదు. మరో యువతిది కూడా ఇదే పరిస్థితి. పరీక్ష రాయలేకపోతున్నందుతు అమె కన్నీటి పర్యంతమయ్యారు.

గ్రూప్‌ 2 పరీక్షలు యథాతథం - ఎలాంటి మార్పు లేదు: ఏపీపీఎస్సీ

గ్రూప్‌-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం సూచించినా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ యథావిధిగా పరీక్ష నిర్వహించేందుకే మొగ్గుచూపింది. అందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. పరీక్ష నిర్వహణ అభ్యర్థులకు శ్రేయస్కరం కాదని, హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాల్సినందున వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసింది. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసిన వారని, వాయిదా వేస్తే అది శాసనమండలి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి శనివారం సాయంత్రం ప్రభుత్వానికి లేఖరాశారు.

శాసనమండలి ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఏపీపీఎస్సీ ఉన్న విషయాన్ని అందులో గుర్తుచేశారు. వాయిదా నిర్ణయం డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులను ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని అందులో పేర్కొన్నారు. అయితే ఏపీపీఎస్సీ వైఖరి పట్ల కొందరు అభ్యర్థులు మండిపడుతున్నారు.

గ్రూప్‌-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం చంద్రబాబు

Bride Appeared for Group2 Mains Exam in Tirupati : ఏపీ వ్యాప్తంగా పటిష్టమైన భద్రత నడుమ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ముగిసాయి. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు మెటల్ డిటెక్టివ్ ద్వారా తనిఖీ చేసి అభ్యర్ధులను పరీక్షా కేంద్రాల్లోకి పంపారు. బ్లూటూత్, చరవాణి తదితరవాతన్నింటిని అభ్యర్ధులు పరీక్ష కేంద్రం బయటనే పెట్టేసి వెళ్లారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ దశలో చోటు చేసుకోకుండా జిరాక్స్ కేంద్రాలను మూసివేశారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్‌ తొలి పేపర్‌ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో పేపర్‌ . 92,250 మంది అభ్యర్థులు పరీక్షలకు హజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, పలుచోట్ల పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు హజరీలో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. పలువురు అభ్యర్ధులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో అధికారులు, పోలీసులు వారిని వెనక్కి పంపించివేయడం పలువుర్ని కలచివేసింది.

తిరుపతిలో జరుగుతున్న గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు ఓ నవవధువు హాజరైంది. చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో ఉదయం పెళ్లి ముహూర్తంలో తలపై జీలకర్ర బెల్లం పెట్టుకుని పరీక్షకు హజరైంది. పెళ్లి తంతంగం పూర్తికి ఇంకా సమయం ఉండటంతో తిరుపతిలోని శ్రీ పద్మావతి పీజీ, ిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రానికి చేరుకుని ఆ నవ వధువు పరీక్ష రాశారు.

వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రమైన కడపలో 13 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద మూడంచల భద్రతను ఏర్పాటు చేశారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. జిల్లా వ్యాప్తంగా 5825 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

విశాఖ జిల్లా ఇచ్చాపురం నుంచి రాజు అనే అభ్యర్థితో పాటు మరో వ్యక్తి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోకపోవడంతో పరీక్షకు అనుమతించలేదు. మరో యువతిది కూడా ఇదే పరిస్థితి. పరీక్ష రాయలేకపోతున్నందుతు అమె కన్నీటి పర్యంతమయ్యారు.

గ్రూప్‌ 2 పరీక్షలు యథాతథం - ఎలాంటి మార్పు లేదు: ఏపీపీఎస్సీ

గ్రూప్‌-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం సూచించినా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ యథావిధిగా పరీక్ష నిర్వహించేందుకే మొగ్గుచూపింది. అందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. పరీక్ష నిర్వహణ అభ్యర్థులకు శ్రేయస్కరం కాదని, హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాల్సినందున వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసింది. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసిన వారని, వాయిదా వేస్తే అది శాసనమండలి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి శనివారం సాయంత్రం ప్రభుత్వానికి లేఖరాశారు.

శాసనమండలి ఎన్నికలు నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఏపీపీఎస్సీ ఉన్న విషయాన్ని అందులో గుర్తుచేశారు. వాయిదా నిర్ణయం డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులను ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని అందులో పేర్కొన్నారు. అయితే ఏపీపీఎస్సీ వైఖరి పట్ల కొందరు అభ్యర్థులు మండిపడుతున్నారు.

గ్రూప్‌-2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం చంద్రబాబు

Last Updated : Feb 23, 2025, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.