ETV Bharat / state

కళ్లలో కారం కొట్టి వ్యక్తిని హత్య చేసిన మహిళ అరెస్టు - విచారణలో దిమ్మ తిరిగే నిజాలు - WOMAN ARRESTED IN JAMMALAMADUGU

ఇద్దరితోనూ అక్రమ సంబంధం- మొదటి వ్యక్తి విషయం తెలిసి మందలింపు, రెండో వ్యక్తితో కలిసి పక్కా ప్లాన్​తో హత్య చేసిన మహిళ

WOMAN ARRESTED IN MURDER CASE AT JAMMALAMADUGU
WOMAN ARRESTED IN MURDER CASE AT JAMMALAMADUGU (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2025, 2:30 PM IST

Woman Arrested In Murder Case In YSR District: వైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో కళ్లలో కారం కొట్టి వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు.

యర్రగుంట్ల మండలం చిలమకూరులో శివరామిరెడ్డికి అరుణతో సుమారు రెండేళ్ల నుంచి అక్రమ సంబంధం ఉండేది. అదే మహిళ సంవత్సరం నుంచి తన ఇంటి ఎదురుగా ఉన్న ఆదెన్న అనే వ్యక్తితో సైతం అక్రమ సంబంధం నడిపేదని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై శివరామిరెడ్డి, అరుణ- ఆదెన్నలను తీవ్రంగా మందిలించినట్లు చెప్పారు. దీంతో మనసులో కక్ష పెట్టుకున్న ఇద్దరు, ఎలాగైనా శివరామిరెడ్డిని చంపాలని పథకం వేశారు.

ఈ నెల 15వ తేదీన అరుణ తన ఇంటికి రమ్మని శివరామిరెడ్డిని పిలిపించుకుంది. ఆయన ఇంట్లోకి రాగానే కళ్లల్లో కారం చల్లి, తాడుతో మెడను బిగించి చంపేసింది. అనంతరం శవాన్ని ఎవరు చూడకుండా అక్కడ నుంచి ఒక ఆటోలో తీసుకుని తొండూరు మండలం మల్లెల ఘాట్ లో పారవేశారన్నారు. అనంతరం శివరామి రెడ్డి సెల్​ఫోన్, చెప్పులు, అతని మెడకు వేసి చంపిన తాడును కాల్చి బూడిదను కాలువలో పడవేశారన్నారు. మృతుడు శివరామి రెడ్డి భార్య రామ లక్షమ్మ ఫిర్యాదు మేరకు యర్రగుంట్ల పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలు అరుణను విచారించగా హత్య చేసిన విషయం అంగీకరించిందని తెలిపారు. మరో నిందితుడు ఆదెన్న ప్రస్తుతం పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

''శివరామి రెడ్డి (మృతుడు) భార్య రామ లక్షమ్మ ఫిర్యాదు మేరకు యర్రగుంట్ల పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. అందుకు గాను అనుమానితురాలిగా అరుణను (నిందితురాలు) విచారించాం. కానీ ఆమె మొదట్లో ఏమీ తెలీదని చెప్పింది. తరువాత విచారణ జరుగుతున్న కొద్దీ ఈమే హత్య చేసినట్లు రుజువైంది. గతంలో శివరామిరెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అదే విధంగా తరువాత అదే మహిళ సంవత్సరం నుంచి తన ఇంటి ఎదురుగా ఉన్న ఆదెన్న అనే వ్యక్తితో సైతం అక్రమ సంబంధం నడిపేదని విచారణలో తేలింది. ఈ విషయంపై శివరామిరెడ్డి అరుణ, ఆదెన్నను తీవ్రంగా మందిలించారు.దీంతో మనసులో కక్ష పెట్టుకున్న ఇద్దరూ ఎలాగైనా శివరామిరెడ్డిని చంపాలని పథకం వేసి చంపేశారు''-వెంకటేశ్వరరావు, డీఎస్పీ జమ్మలమడుగు

'నాకు నచ్చినవారితో కలిసి జీవిస్తా'- నగలు, డబ్బులతో 'ఆమె' జంప్​- మూడో పెళ్లికి సిద్ధం- చివరకు! - Married Woman Arrested in karur

40ఏళ్ల లోపు సింగిల్సే ఆమె టార్గెట్- 12మందితో పెళ్లి- డబ్బు, నగలతో జంప్- చివరికి! - Women Married Many Men

Woman Arrested In Murder Case In YSR District: వైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో కళ్లలో కారం కొట్టి వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు.

యర్రగుంట్ల మండలం చిలమకూరులో శివరామిరెడ్డికి అరుణతో సుమారు రెండేళ్ల నుంచి అక్రమ సంబంధం ఉండేది. అదే మహిళ సంవత్సరం నుంచి తన ఇంటి ఎదురుగా ఉన్న ఆదెన్న అనే వ్యక్తితో సైతం అక్రమ సంబంధం నడిపేదని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై శివరామిరెడ్డి, అరుణ- ఆదెన్నలను తీవ్రంగా మందిలించినట్లు చెప్పారు. దీంతో మనసులో కక్ష పెట్టుకున్న ఇద్దరు, ఎలాగైనా శివరామిరెడ్డిని చంపాలని పథకం వేశారు.

ఈ నెల 15వ తేదీన అరుణ తన ఇంటికి రమ్మని శివరామిరెడ్డిని పిలిపించుకుంది. ఆయన ఇంట్లోకి రాగానే కళ్లల్లో కారం చల్లి, తాడుతో మెడను బిగించి చంపేసింది. అనంతరం శవాన్ని ఎవరు చూడకుండా అక్కడ నుంచి ఒక ఆటోలో తీసుకుని తొండూరు మండలం మల్లెల ఘాట్ లో పారవేశారన్నారు. అనంతరం శివరామి రెడ్డి సెల్​ఫోన్, చెప్పులు, అతని మెడకు వేసి చంపిన తాడును కాల్చి బూడిదను కాలువలో పడవేశారన్నారు. మృతుడు శివరామి రెడ్డి భార్య రామ లక్షమ్మ ఫిర్యాదు మేరకు యర్రగుంట్ల పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలు అరుణను విచారించగా హత్య చేసిన విషయం అంగీకరించిందని తెలిపారు. మరో నిందితుడు ఆదెన్న ప్రస్తుతం పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

''శివరామి రెడ్డి (మృతుడు) భార్య రామ లక్షమ్మ ఫిర్యాదు మేరకు యర్రగుంట్ల పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. అందుకు గాను అనుమానితురాలిగా అరుణను (నిందితురాలు) విచారించాం. కానీ ఆమె మొదట్లో ఏమీ తెలీదని చెప్పింది. తరువాత విచారణ జరుగుతున్న కొద్దీ ఈమే హత్య చేసినట్లు రుజువైంది. గతంలో శివరామిరెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అదే విధంగా తరువాత అదే మహిళ సంవత్సరం నుంచి తన ఇంటి ఎదురుగా ఉన్న ఆదెన్న అనే వ్యక్తితో సైతం అక్రమ సంబంధం నడిపేదని విచారణలో తేలింది. ఈ విషయంపై శివరామిరెడ్డి అరుణ, ఆదెన్నను తీవ్రంగా మందిలించారు.దీంతో మనసులో కక్ష పెట్టుకున్న ఇద్దరూ ఎలాగైనా శివరామిరెడ్డిని చంపాలని పథకం వేసి చంపేశారు''-వెంకటేశ్వరరావు, డీఎస్పీ జమ్మలమడుగు

'నాకు నచ్చినవారితో కలిసి జీవిస్తా'- నగలు, డబ్బులతో 'ఆమె' జంప్​- మూడో పెళ్లికి సిద్ధం- చివరకు! - Married Woman Arrested in karur

40ఏళ్ల లోపు సింగిల్సే ఆమె టార్గెట్- 12మందితో పెళ్లి- డబ్బు, నగలతో జంప్- చివరికి! - Women Married Many Men

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.