One person dies in cattle festival: పశువుల పండుగలో విషాదం నెలకొంది. ఎద్దు ఢీకొని సీనప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వెంకటగిరి కోట మండలం ఎర్రినాగేపల్లిలో జరిగింది. జిల్లాలోని మోర్నపల్లి గ్రామానికి చెందిన సీనప్ప (54) పశువుల పండుగ నిర్వహించే క్రమంలో ఎద్దు ఢీకొని మృతి చెందాడు. అలాగే మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులని వి.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
మృతుడు సీనప్పకి భార్య, కుమారుడు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని పలమనేరు ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: