ETV Bharat / state

ఏడేళ్ల బాలికపై తాపీమేస్త్రీ అత్యాచారయత్నం

చిత్తూరు జిల్లా పీలేరు పట్టణ శివారులోని ఏడేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

author img

By

Published : Jul 6, 2019, 4:46 PM IST

నిందితుడిని చూపిస్తున్న గ్రామస్థులు
నిందితుడిని విచారిస్తున్న గ్రామస్థులు

ఏడేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం శివారులోని ఎర్రమ్మరెడ్డిగుట్టలో చోటు చేసుకుంది. ఎరమరెడ్డిగుట్టలో నివాసముంటున్న ఓ కుటుంబ యజమాని ఇటీవల ద్విచక్ర వాహనం నుంచి కిందపడి గాయపడ్డాడు. తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలో భర్తతో పాటు భార్య ఉండగా.. వారి ముగ్గురు పిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే మిద్దెపై బట్టలు తీసుకువచ్చేందుకు వెళ్లిన బాలికపై.. తాపీమేస్త్రి రవి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక ఎంతకూ తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డ చిన్నారి బంధువులు మిద్దెపైకి వెళ్లి చూడగా.. రవి వ్యవహారం బయటపడింది. ఇరుగుపొరుగు వారి సహాయంతో రవిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీస్​స్టేషన్​లో అప్పగించారు. బాలిక బంధువుల సమక్షంలో విచారించగా జరిగిన విషయం తెలిసింది. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి మేడపై పడుకున్నారని తెలిసి... ఇళ్లంతా ఊడ్చేశారు..

నిందితుడిని విచారిస్తున్న గ్రామస్థులు

ఏడేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం శివారులోని ఎర్రమ్మరెడ్డిగుట్టలో చోటు చేసుకుంది. ఎరమరెడ్డిగుట్టలో నివాసముంటున్న ఓ కుటుంబ యజమాని ఇటీవల ద్విచక్ర వాహనం నుంచి కిందపడి గాయపడ్డాడు. తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలో భర్తతో పాటు భార్య ఉండగా.. వారి ముగ్గురు పిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే మిద్దెపై బట్టలు తీసుకువచ్చేందుకు వెళ్లిన బాలికపై.. తాపీమేస్త్రి రవి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక ఎంతకూ తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డ చిన్నారి బంధువులు మిద్దెపైకి వెళ్లి చూడగా.. రవి వ్యవహారం బయటపడింది. ఇరుగుపొరుగు వారి సహాయంతో రవిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీస్​స్టేషన్​లో అప్పగించారు. బాలిక బంధువుల సమక్షంలో విచారించగా జరిగిన విషయం తెలిసింది. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి మేడపై పడుకున్నారని తెలిసి... ఇళ్లంతా ఊడ్చేశారు..

Intro:AP_TPG_06_06_BUDJET_PAI_NIRASANA_DHARNA_AVB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సిపిఎం పార్టీ
ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ వసంత మహల్ సెంటర్ లో ధర్నా నిర్వహించి అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.


Body:ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు మాట్లాడుతూ పార్లమెంటులో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నులకు వరాలు పేదలపై భారాలు వేసేలా ఉందని ఆయన విమర్శించారు. కీలకమైన వ్యవసాయ రంగాన్ని బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నారు. పెట్రోలు డీజిల్ లో తదితర ఎత్తు పెంచి సామాన్య మధ్యతరగతి భారాలు వేస్తుందన్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం హామీలు ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు నిధులు వెనకబడిన జిల్లాలకు నిధులు ఇలా ఏమి కేటాయింపులు చేయకుండా తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు.


Conclusion:ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బైట్. చింతకాయల బాబురావు సిపిఎం జిల్లా కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.