ETV Bharat / state

'విలువలు పాటించండి... సమస్యలపై చర్చించండి '

అసెంబ్లీలో సభ్యుల తీరుపై సభాపతి తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయకూడదని... ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.

author img

By

Published : Jun 13, 2019, 4:48 PM IST

Updated : Jun 18, 2019, 10:58 AM IST

తమ్మినేని సీతారాం
సభాపతి సూచనలు

నూతన సభాపతి తమ్మినేని సీతారాం శాసనసభ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పుడు సభాపతి సవాళ్ల​ను అధిగమిస్తాననే నమ్మకం కలిగిందని... అయితే సభ్యుల తీరు చూశాక బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో నైతిక విలువలు పెంపొదించాల్సిన అవసరముందని అన్నారు. ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయని వాటిపైన చర్చించాలని సభ్యులకు సూచించారు. అవినీతిరహిత పాలన అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని... నిరక్షరాస్యత, వలసల నివారణపై చర్చలు సాగిద్దామని హితవు పలికారు.

శాసనసభ నిర్వహణపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని... వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అందిరపై ఉందని వివరించారు. సభ గౌరవంపై శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నామని వెల్లడించారు. పతనావస్థకు చేరుకున్న వ్యవస్థలో విలువలు నెలకొల్పాలని పిలుపునిచ్చారు. శాసనసభ సభ్యుల నిర్ణయాలను కోర్టులు సమీక్షించాల్సిన పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చలు జరుపుతూ రాష్ట్ర శాసనసభను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని సభ్యులను సభాపతి తమ్మినేని సీతారాం కోరారు.

సభాపతి సూచనలు

నూతన సభాపతి తమ్మినేని సీతారాం శాసనసభ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నప్పుడు సభాపతి సవాళ్ల​ను అధిగమిస్తాననే నమ్మకం కలిగిందని... అయితే సభ్యుల తీరు చూశాక బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో నైతిక విలువలు పెంపొదించాల్సిన అవసరముందని అన్నారు. ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయని వాటిపైన చర్చించాలని సభ్యులకు సూచించారు. అవినీతిరహిత పాలన అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని... నిరక్షరాస్యత, వలసల నివారణపై చర్చలు సాగిద్దామని హితవు పలికారు.

శాసనసభ నిర్వహణపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని... వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అందిరపై ఉందని వివరించారు. సభ గౌరవంపై శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నామని వెల్లడించారు. పతనావస్థకు చేరుకున్న వ్యవస్థలో విలువలు నెలకొల్పాలని పిలుపునిచ్చారు. శాసనసభ సభ్యుల నిర్ణయాలను కోర్టులు సమీక్షించాల్సిన పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చలు జరుపుతూ రాష్ట్ర శాసనసభను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని సభ్యులను సభాపతి తమ్మినేని సీతారాం కోరారు.

Intro:ap_atp_61_13_collector_tour_avb_c11
--------------------------*
విద్యా ప్రమాణాలు పెంపొందిస్తాం: కలెక్టర్ సత్యనారాయణ
---------------------------*
వెనుకబడిన జిల్లా అయిన అనంతపురం జిల్లాలో ప్రాథమిక దశ నుంచి విద్యా ప్రమాణాలను అందిస్తామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశారు అంతపురం జిల్లా బోరంపల్లి గ్రామంలో రాజన్న పడిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ గ్రామ పరిధిలో లో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించి గ్రామంలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో బడి బాట కార్యక్రమంలో పాలుపంచుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందే అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకొని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక దశ నుంచే విద్యా ప్రమాణాలను పెంపొందిస్తాయని చదువుకునేందుకు ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సూచనల మేరకు ఆదుకుంటామని ఆయన తెలిపారు


Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గం


Conclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
Last Updated : Jun 18, 2019, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.