ETV Bharat / state

ఈ ఏడాదైనా విద్యార్థులకు సైకిళ్లు అందేనా..!

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో నడక కష్టాలు తప్పటం లేదు. గత ప్రభుత్వంలో సర్వశిక్షా అభియాన్ ద్వారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న సైకిళ్లు ఇంకా వారికి అందలేదు. విద్యాశాఖ కమీషనర్ నుంచి ఉత్తర్వులు రాకపోవటంతో పంపిణీ నిలిపివేశారు.

author img

By

Published : Jun 22, 2019, 8:00 PM IST

'విద్యార్థులు చేతికి సైకిల్ అందక...కాలికి తిప్పలు'
'విద్యార్థుల చేతికి సైకిల్ అందక...కాలికి తిప్పలు'

రాష్ట్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నడక తిప్పలు తప్పట్లేదు. గత ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ ద్వారా ఆయా స్కూళ్లకు సైకిళ్లను పంపిణీ చేసేది. నూతన ప్రభుత్వం రావటం...విద్యా శాఖ కమీషనర్ నుంచి ఆదేశాలు రాకపోవటంతో...సైకిళ్లను విద్యార్థులకు ఇవ్వకుండా పాఠశాలల్లోనే ఉంచారు. ఈ కారణంగా నాలుగైదు కిలోమీటర్ల నుంచి వచ్చే విద్యార్థులు కాలినడకన రావాల్సి వస్తోంది. దీనివల్ల సకాలంలో స్కూలుకు చేరుకోలేకపోతున్నామని... త్వరగా వచ్చేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి-'3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు'

'విద్యార్థుల చేతికి సైకిల్ అందక...కాలికి తిప్పలు'

రాష్ట్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నడక తిప్పలు తప్పట్లేదు. గత ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ ద్వారా ఆయా స్కూళ్లకు సైకిళ్లను పంపిణీ చేసేది. నూతన ప్రభుత్వం రావటం...విద్యా శాఖ కమీషనర్ నుంచి ఆదేశాలు రాకపోవటంతో...సైకిళ్లను విద్యార్థులకు ఇవ్వకుండా పాఠశాలల్లోనే ఉంచారు. ఈ కారణంగా నాలుగైదు కిలోమీటర్ల నుంచి వచ్చే విద్యార్థులు కాలినడకన రావాల్సి వస్తోంది. దీనివల్ల సకాలంలో స్కూలుకు చేరుకోలేకపోతున్నామని... త్వరగా వచ్చేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి-'3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు'

Intro:AP_TPT_31_21_collector_dharson_avb_c4 శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా


Body:బృహత్తర ప్రణాళికలతో శ్రీకాలహస్తీరాలయం అభివృద్ధి చెందుతుందని జిల్లా పాలనాధికారి నారాయణ్ భరత్ గుప్తా తెలిపారు. ఆలయాన్ని దర్శించుకుని కలెక్టర్ కు ఈవో శ్రీ రామ రామ స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ బృహత్తర ప్రణాళిక సంబంధించి కొంత మేర స్థల వివాదం ఉన్నట్లు తెలిపారు. నిర్వాసితులతో చర్చించి త్వరితగతిన ప్రణాళికలు సిద్ధం చేస్తామని వివరించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతి రేఖంగా ఇసుక రవాణా చేపడితే చర్యలు తప్పని హెచ్చరించారు.


Conclusion:శ్రీకాళహస్తి ఆలయం దర్శించుకున్న కలెక్టర్ భరత్ గుప్తా ఈటీవీ భారత్ శ్రీకాళహస్తి. సి. వెంకటరత్నం, 8008574559.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.