జగన్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా... విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ ద్వారక తిరుమలరావు తెలిపారు. స్టేడియం లోపల భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వివరించారు. స్టేడియం మొత్తం సామర్థ్యం 30 వేలమందికి ఉందన్న సీపీ... గ్రౌండ్లో 12 వేలు, గ్యాలరీలో 18 వేలమంది కూర్చునే వీలుందని వివరించారు. ప్రమాణ స్వీకారానికి 12 వేల పాసులు జారీ చేస్తున్నామని చెప్పారు.
సాధారణ ప్రజలను గ్యాలరీలోకి అనుమతిస్తామని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. స్టేడియం పక్కన ఉండే ప్రజలు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విజయవాడ మీదుగా వెళ్లే భారీ వాహనాలను శివారు మీదుగా మళ్లిస్తామన్న సీపీ... బుధవారం అర్ధరాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయని స్పష్టం చేశారు. నగరంలో స్టేడియం మీదుగా వెళ్లే వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లిస్తున్నట్లు చెప్పారు.
ఐదు రకాల పాస్లు ఉన్నాయన్న సీపీ ద్వారకా తిరుమలరావు... పాసులు ఉన్నవారంతా ఉదయం 10.30 గంటలలోపు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. వాహనాలు నిలిపి ఉంచేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్న సీపీ... పీడబ్ల్యూడీ గ్రౌండ్లో కార్లు నిలిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వేదిక సమీపం వరకూ వాహనాలు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్న సీపీ ద్వారకా తిరుమలరావు... హైదరాబాద్, విశాఖ నుంచి వచ్చే వాహనాలు హనుమాన్ జంక్షన్ వద్ద దారిమళ్లించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండీ...