మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం జమ్ములబండ గ్రామంలో... బసవరాజు అనే రైతుకు చెందిన 250 మామిడి చెట్లకు, 150 చింత చెట్లకు దుండగులు నిప్పు పెట్టారు. పిందె దశలో ఉన్న మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
"ఆరు సంవత్సరాల నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి కంటికి రెప్పలా కాపాడుకున్నాను. దిగుబడి వచ్చే సమయంలో దుండగులు నిప్పు పెట్టారు. పూర్తిగా నష్టపోయాను" అని బాధితుడు రోదించారు. ప్రభుత్వమే తనని ఆదుకోవాలని బసవరాజు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: