ETV Bharat / state

మడకశిరలో మామిడి, చింత చెట్లకు నిప్పు.. రైతుకు భారీ నష్టం

అనంతపురం జిల్లా మడకశిరలో దుండగులు మామిడి, చింత చెట్లకు నిప్పు పెట్టారు. పిందె దశలో ఉన్న మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అవ్వటంతో.. రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.

author img

By

Published : Feb 4, 2021, 2:12 PM IST

fire to  mango trees and tamarind trees
మడకశిరలో మామిడి, చింత చెట్లకు నిప్పు పెట్టిన దుండగులు

మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం జమ్ములబండ గ్రామంలో... బసవరాజు అనే రైతుకు చెందిన 250 మామిడి చెట్లకు, 150 చింత చెట్లకు దుండగులు నిప్పు పెట్టారు. పిందె దశలో ఉన్న మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.

"ఆరు సంవత్సరాల నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి కంటికి రెప్పలా కాపాడుకున్నాను. దిగుబడి వచ్చే సమయంలో దుండగులు నిప్పు పెట్టారు. పూర్తిగా నష్టపోయాను" అని బాధితుడు రోదించారు. ప్రభుత్వమే తనని ఆదుకోవాలని బసవరాజు వేడుకుంటున్నారు.

మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం జమ్ములబండ గ్రామంలో... బసవరాజు అనే రైతుకు చెందిన 250 మామిడి చెట్లకు, 150 చింత చెట్లకు దుండగులు నిప్పు పెట్టారు. పిందె దశలో ఉన్న మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.

"ఆరు సంవత్సరాల నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి కంటికి రెప్పలా కాపాడుకున్నాను. దిగుబడి వచ్చే సమయంలో దుండగులు నిప్పు పెట్టారు. పూర్తిగా నష్టపోయాను" అని బాధితుడు రోదించారు. ప్రభుత్వమే తనని ఆదుకోవాలని బసవరాజు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

తెదేపా నేత పట్టాభిపై దాడి కేసు.. దొరకని నిందితుల ఆచూకీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.