ETV Bharat / state

గుంతకల్లులో చోరీ.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని సాయినగర్​లో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

author img

By

Published : Feb 7, 2021, 10:20 AM IST

Theft in gunthakallu
గుంతకల్లులో చోరీ

అనంతపురం జిల్లా గుంతకల్లులో సాయినగర్​లోని ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాత్రి 8:30 గంటలకు యజమానురాలు వంట చేస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి వచ్చారు. బీరువాలో ఉన్న 17తులాల బంగారంతో పాటు రూ.30వేలు దోచుకెళ్లారు. ఆలస్యంగా గమనించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండవ పట్టణ సీఐ తన సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అనంతపురం జిల్లా గుంతకల్లులో సాయినగర్​లోని ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రాత్రి 8:30 గంటలకు యజమానురాలు వంట చేస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి వచ్చారు. బీరువాలో ఉన్న 17తులాల బంగారంతో పాటు రూ.30వేలు దోచుకెళ్లారు. ఆలస్యంగా గమనించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండవ పట్టణ సీఐ తన సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: 'హెచ్ఎల్​సీ నీటి కేటాయింపుల్లో అనంతపురం జిల్లాకు అన్యాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.