ETV Bharat / state

మూడిళ్లలో చోరీ... ఒకరు మాత్రమే ఫిర్యాదు! - theft in anantapur district

అనంతపురం జిల్లాలో జరిగిన దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గౌడనుకుంట, తమ్మిడేపల్లి గ్రామాల్లో మూడిళ్లలో దొంగతనం జరగ్గా.. ఒకరు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 500 గ్రాముల బంగారం, రూ.4 లక్షలు దోచుకెళ్లారని బాధితులు వాపోయారు.

theft in anantapur district
మూడిళ్లలో చోరీ...ఒకరు మాత్రమే ఫిర్యాదు
author img

By

Published : Jan 6, 2021, 8:06 AM IST

అనంతపురం జిల్లా అమరాపురం మండలం గౌడనకుంట, తమ్మిడేపల్లి గ్రామాల్లో సోమవారం రాత్రి తాళం వేసిన 3 ఇళ్లలో దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విరూపాక్షప్ప, క్రిష్టప్ప, పార్వతమ్మ.. తమ ఇంటికి తాళంవేసి పనుల నిమిత్తం వెళ్లారు. సోమవారం రాత్రి దొంగలు మూడిళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయం ఇంటికి చేరిన యజమానులు తెరచి ఉన్న తలుపులు చూసి అవాక్కయ్యారు. ముగ్గురి ఇళ్లలో 500 గ్రాముల బంగారు, 4 లక్షల నగదు దోచుకెళ్లారని బాధితులు చెప్పారు.

ఒకరు మాత్రమే ఫిర్యాదు:

గౌడనకుంటలోని తన ఇంట్లో.. దొంగలు చొరబడి 150 గ్రాముల బంగారు నగలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారని విరూపాక్షప్ప ఒక్కడే ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు.

అనంతపురం జిల్లా అమరాపురం మండలం గౌడనకుంట, తమ్మిడేపల్లి గ్రామాల్లో సోమవారం రాత్రి తాళం వేసిన 3 ఇళ్లలో దొంగతనం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విరూపాక్షప్ప, క్రిష్టప్ప, పార్వతమ్మ.. తమ ఇంటికి తాళంవేసి పనుల నిమిత్తం వెళ్లారు. సోమవారం రాత్రి దొంగలు మూడిళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయం ఇంటికి చేరిన యజమానులు తెరచి ఉన్న తలుపులు చూసి అవాక్కయ్యారు. ముగ్గురి ఇళ్లలో 500 గ్రాముల బంగారు, 4 లక్షల నగదు దోచుకెళ్లారని బాధితులు చెప్పారు.

ఒకరు మాత్రమే ఫిర్యాదు:

గౌడనకుంటలోని తన ఇంట్లో.. దొంగలు చొరబడి 150 గ్రాముల బంగారు నగలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారని విరూపాక్షప్ప ఒక్కడే ఫిర్యాదు చేశాడని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

తెదేపా సానుభూతి పరుడిపై కత్తులతో దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.