ETV Bharat / state

అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్​ టెస్టులు నిలుపుదల

author img

By

Published : May 2, 2021, 2:52 PM IST

కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న వేళ.. లక్షణాలున్న ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. టెస్టింగ్​ సెంటర్లలో జనం బారులు తీరుతున్నారు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్​ పరీక్షలు ఆపేశారు. దీంతో ప్రజలు వెనుతిరగాల్సి వస్తోంది.

Anantapur Government Hospital
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి

వైద్య పరీక్షల్లో ఆలస్యం, చికిత్స అందకపోవటం వల్ల మృతి చెందిన కరోనా రోగులు ఎందరో. ఒకవైపు కొవిడ్​ మరణాలు పెరుగుతుంటే.. మరోవైపు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో టెస్టులు నిలిపేశారు. దీంతో వైద్య పరీక్షల కోసం వచ్చేవారి పరిస్థితి దయనీయంగా మారింది. విషయం తెలియక వచ్చిన వారిని ఆస్పత్రి గేటు వద్ద నుంచే పంపించేస్తున్నారు. భయాందోళనకు గురవుతూ అక్కడి నుంచి వెనుదిరుగుతున్నారు. కరోనా పరీక్షల కోసం వచ్చిన వారితో గందరగోళంగా ఉండే ఆస్పత్రి.. ఖాళీగా దర్శనమిస్తోంది. ఆస్పత్రి ప్రాంగణంలో ఈ రోజుక ఏర్పాటు చేసిన ప్రైవేట్​ టెస్టు సెంటర్​లో ఆరుగురు మృతి చెందినట్లు సిబ్బంది తెలిపారు. జిల్లా యంత్రాంగం స్పందించి.. చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వైద్య పరీక్షల్లో ఆలస్యం, చికిత్స అందకపోవటం వల్ల మృతి చెందిన కరోనా రోగులు ఎందరో. ఒకవైపు కొవిడ్​ మరణాలు పెరుగుతుంటే.. మరోవైపు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో టెస్టులు నిలిపేశారు. దీంతో వైద్య పరీక్షల కోసం వచ్చేవారి పరిస్థితి దయనీయంగా మారింది. విషయం తెలియక వచ్చిన వారిని ఆస్పత్రి గేటు వద్ద నుంచే పంపించేస్తున్నారు. భయాందోళనకు గురవుతూ అక్కడి నుంచి వెనుదిరుగుతున్నారు. కరోనా పరీక్షల కోసం వచ్చిన వారితో గందరగోళంగా ఉండే ఆస్పత్రి.. ఖాళీగా దర్శనమిస్తోంది. ఆస్పత్రి ప్రాంగణంలో ఈ రోజుక ఏర్పాటు చేసిన ప్రైవేట్​ టెస్టు సెంటర్​లో ఆరుగురు మృతి చెందినట్లు సిబ్బంది తెలిపారు. జిల్లా యంత్రాంగం స్పందించి.. చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఓ పక్క కరోనా కష్టాలు... మరోపక్క తాగునీటి సమస్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.