డివైడర్ను ఢీకొని బస్సు బోల్తా... 12 మందికి గాయాలు బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వస్తున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు అనంతపురం జిల్లా సోములదొడ్డి గ్రామ సమీపంలోవద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉండటం వలన వారిని స్థానికులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం చోటు చేసుకుందని కొందరు ప్రయాణికులు తెలుపగా .. బస్సు టైర్ పంక్చరై డివైడర్ ఢీకొట్టిందని మరికొంతమంది అంటున్నారు. గాయపడిన వారిలో కావ్య (28), గంగా చరణ్ (28), శిరీష(28), అవంతి(24) ఉన్నారు. ఇదీ చదవండి :
రెండు కార్లు ఢీ.. పలువురికి గాయాలు