ETV Bharat / state

డివైడర్​ను ఢీకొని బస్సు బోల్తా... 12 మందికి గాయాలు - డివైడర్​ను ఢీకొని బస్సు బోల్తా... 11 మందికి గాయాలు

బెంగళూరు నుంచి హైదరాబాద్ ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అనంతపురం జిల్లా సోములదొడ్డి వద్ద బోల్తాపడింది. ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. బస్సు రోడ్డుకు అడ్డంగా బోల్తాపడటం వలన ట్రాఫిక్ భారీగా స్తంభించింది.

డివైడర్​ను ఢీకొని బస్సు బోల్తా... 11 మందికి గాయాలు
author img

By

Published : Oct 10, 2019, 6:06 AM IST

Updated : Oct 11, 2019, 12:14 AM IST

డివైడర్​ను ఢీకొని బస్సు బోల్తా... 12 మందికి గాయాలు
బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వస్తున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు అనంతపురం జిల్లా సోములదొడ్డి గ్రామ సమీపంలోవద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉండటం వలన వారిని స్థానికులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం చోటు చేసుకుందని కొందరు ప్రయాణికులు తెలుపగా .. బస్సు టైర్ పంక్చరై డివైడర్​ ఢీకొట్టిందని మరికొంతమంది అంటున్నారు. గాయపడిన వారిలో కావ్య (28), గంగా చరణ్ (28), శిరీష(28), అవంతి(24) ఉన్నారు.

ఇదీ చదవండి :

రెండు కార్లు ఢీ.. పలువురికి గాయాలు

డివైడర్​ను ఢీకొని బస్సు బోల్తా... 12 మందికి గాయాలు
బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వస్తున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు అనంతపురం జిల్లా సోములదొడ్డి గ్రామ సమీపంలోవద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉండటం వలన వారిని స్థానికులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం చోటు చేసుకుందని కొందరు ప్రయాణికులు తెలుపగా .. బస్సు టైర్ పంక్చరై డివైడర్​ ఢీకొట్టిందని మరికొంతమంది అంటున్నారు. గాయపడిన వారిలో కావ్య (28), గంగా చరణ్ (28), శిరీష(28), అవంతి(24) ఉన్నారు.

ఇదీ చదవండి :

రెండు కార్లు ఢీ.. పలువురికి గాయాలు

Intro:పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శేషాచల పర్వతం పై కొలువైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్వయుజ మాస తిరు కల్యాణ మహోత్సవాలు ఆధ్యాంతం కన్నుల పండువగా జరుగుతున్నాయి. ద్వారకా తిరుమల క్షేత్రం బ్రహ్మోత్సవాల శోభతో కళకళలాడుతోంది. ఉత్సవాలను కనులారా వీక్షించి తరించాలని భక్త కోటి క్షేత్రానికి చేరుకుంటుంది
.


Body:శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండవ రోజు బుధవారం రాత్రి ధ్వజారోహణ జరిపి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు సర్వదేవతలను ఆహ్వానించేలా ఆలయ పండితులు, అర్చకులు గరుడ పటాన్ని ఎగరవేశారు. ముహూర్త సమయంలో వైఖానస ఆగమ యుక్తంగా వేదమంత్రాల నడుమ జరిగిన ఈ ఘట్టం భక్తకోటికి కనుల పండువ అయింది . ముందుగా ఋత్విగ్వరణ, మృద్గ్రహణ, అంకురార్పణ వంటి కార్యక్రమాలు వేడుకగా నిర్వహించారు. అనంతరంగరుడపటాన్నిఎగరవేశారు. స్వామివారి ప్రత్యేక అలంకారల్లో భాగంగా కాళీయమర్దనం అలంకారంలో భక్తులను కనువిందు చేశారు. ...హంస వాహనంపై చదువుల తల్లి అలంకారంలో వరించిన శ్రీవారు..... తిరు కల్యాణ మహోత్సవాలు రెండో రోజు స్వామివారు చదువుల తల్లి సరస్వతి అవతారంలో హంస వాహనంపై క్షేత్ర తిరు వీధుల్లో విహరించారు .హంస వాహన రూఢుడై సరస్వతి దేవి అలంకారంలో వివేకాన్ని భక్తులకు బోధిస్తున్న ట్లు సాక్షాత్కరించారు. వేదమంత్రాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ సరస్వతి రూపుదాల్చిన ఆ శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి క్షేత్ర తిరు వీధుల్లో విహరించారు. భక్తులు దారిపొడవునా స్వామి వారికి కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు ..


Conclusion:భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు
Last Updated : Oct 11, 2019, 12:14 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.