అనంతపురం జిల్లా హిందూపురం గ్రామీణ మండలం మణేసముద్రం గ్రామంలో బుధవారం పట్టుబడ్డ నకిలీ మద్యం రవాణా కేసులో హిందూపురం ఎక్సైజ్ పోలీసులు పురోగతి సాధించారు. పెనుగొండ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది.. కానిస్టేబుల్ వెంకటేష్, ప్రసాద్, చౌడయ్యలు అక్రమ రవాణాకు సహకరిస్తున్నట్టుగా గుర్తించారు. వారిని సస్పెండ్ చేశారు. వారిపై కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ వెల్లడించారు.
బెంగుళూరు నుంచి నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్న ముఠాకు ఎక్సైజ్ సిబ్బంది సహకరిస్తున్నారన్న విషయం నిర్ధారణ కావడంతో.. వారిపై శాఖాపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు.. ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే మరో నలుగురు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారని.. వారంతా పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: