అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తోంది. సోమందెపల్లి, పరిగి మండలాల్లో సాయంత్రం నుంచి ఉరుములుతో కూడిన వర్షం కురుస్తోంది. సోమందెపల్లిలో పిడుగుపాటుకు కొబ్బరిచెట్టుపై ధ్వంసమైంది.సాయంత్రం 5 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.