అనంతపురం జిల్లా పెనుకొండలో కాంగ్రెస్, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ.. ధర్నా చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడలిలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
పెనుగొండ ఎమ్మెల్యే బీ.జే పార్థసారథి ఆధ్వర్యంలో పెనుకొండలోని ఎన్టీఆర్ కూడలిలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా కోరుతూ పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించి.. ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.