అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు సుమారు 350 మంది భక్తులు పాదయాత్రగా తరలివచ్చారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బ్రహ్మసముద్రం మండలం పడమర, కోడిపల్లి పరిసర గ్రామాల నుంచి 250 కిలోమీటర్లు కాలినడకన పయనించి.. క్షేత్రానికి చేరుకున్నారు.
ఎలవగంపలతో ఊరేగింపుగా ఆలయం పరిధిలోని పాలబావికి వచ్చిన భక్తులు... స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ దేవదేవుడిని దర్శించుకోవడం వరంలా భావిస్తున్నామని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: