ETV Bharat / state

'కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులకు బీమా ప్రకటించాలి'

author img

By

Published : May 15, 2020, 3:37 PM IST

లాక్​డౌన్​ సమయంలో వైద్య, ఆరోగ్య, పోలీస్​ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం రూ. 50 లక్షల బీమా ప్రకటించింది. వారికి మాదిరిగానే అంగన్​వాడీ వర్కర్స్​, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులకు ఆ సౌకర్యం కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం పెనుకొండ తహసీల్దార్​కు వినతిపత్రం అందించారు.

citu protest in penukonda ahsildar office
పెనుకొండ తహసీల్దార్​కు వినతిపత్రం అందజేస్తున్న సీఐటీయూ నాయకులు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం... వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు రూ.50 లక్షలు బీమా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న అంగన్​వాడీ వర్కర్స్, కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులకూ బీమా సౌకర్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ కోరారు. గురువారం పెనుకొండలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆలిండియా కమిటీ పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ నాగరాజుకి వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి :

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం... వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు రూ.50 లక్షలు బీమా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న అంగన్​వాడీ వర్కర్స్, కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులకూ బీమా సౌకర్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ కోరారు. గురువారం పెనుకొండలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆలిండియా కమిటీ పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ నాగరాజుకి వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి :

వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.