ETV Bharat / state

హిందూపురంలో విజృంభిస్తున్న కరోనా

author img

By

Published : May 8, 2020, 5:30 PM IST

అనంతపురం జిల్లాలో తాజాగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో అత్యధికంగా 15 మంది హిందూపురం పట్టణ వాసులే కావడం అక్కడి ప్రజలను ఆందోళన కలిస్తోంది. జిల్లా యంత్రాంగం ఇప్పటికే హిందూపురంపై పూర్తి దృష్టి కేంద్రీకరించినట్లు అధికారులు తెలిపారు.

హిందూపురంలో విజృంభిస్తున్న కరోనా
హిందూపురంలో విజృంభిస్తున్న కరోనా

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో కరోనా వైరస్​ విజృంపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల బులిటెన్​లో అనంతపురం జిల్లాలో 16 మందికి కొత్తగా వైరస్ నమోదైనట్లు ప్రకటించారు. వీరిలో 15 మంది హిందూపురం పట్టణానికి చెందిన వారు కాగా... ఒకరు అనంతపురంలోని రహమత్ నగర్​వాసి ఉన్నారు. హిందూపురంలో వైరస్ సోకిన 15 మందిలో తొమ్మిది మంది ఇప్పటికే క్వారంటైన్​లో అనుమానితులుగా ఉన్న వారే. మిగిలిన ఆరుగురు హిందూపురం పట్టణం రెడ్​జోన్ ప్రాంతాల్లోని కాలనీవాసులు. గత వారం రోజులుగా వస్తున్న పాజిటివ్ కేసులు పట్టణంలోనే నమోదు కావటంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది. జిల్లా యంత్రాంగం ఇప్పటికే హిందూపురంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు.

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో కరోనా వైరస్​ విజృంపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల బులిటెన్​లో అనంతపురం జిల్లాలో 16 మందికి కొత్తగా వైరస్ నమోదైనట్లు ప్రకటించారు. వీరిలో 15 మంది హిందూపురం పట్టణానికి చెందిన వారు కాగా... ఒకరు అనంతపురంలోని రహమత్ నగర్​వాసి ఉన్నారు. హిందూపురంలో వైరస్ సోకిన 15 మందిలో తొమ్మిది మంది ఇప్పటికే క్వారంటైన్​లో అనుమానితులుగా ఉన్న వారే. మిగిలిన ఆరుగురు హిందూపురం పట్టణం రెడ్​జోన్ ప్రాంతాల్లోని కాలనీవాసులు. గత వారం రోజులుగా వస్తున్న పాజిటివ్ కేసులు పట్టణంలోనే నమోదు కావటంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది. జిల్లా యంత్రాంగం ఇప్పటికే హిందూపురంపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు.

ఇదీ చూడండి:'వెయ్యి పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.